Sripuram Golden Temple: అరుదైన రికార్డ్ సొంతం చేసుకున్న శ్రీపురం గోల్డెన్ టెంపుల్.. అలాంటివారు ఒక్కసారి దర్శించుకుంటే చాలట..!

|

Jul 28, 2023 | 3:53 PM

Velluru Golden Temple: వెల్లూరులో ఉన్న గోల్డెన్ టెంపుల్ మరో అరుదైన రికార్డ్‌ని సొంతం చేసుకుంది. తిరుపతి, కాణిపాకం దర్శనాలకు వెళ్లే భక్తులు తప్పనిసరిగా విజిట్ చేస్తున్న ఆలయాల్లో ఒకటిగా గోల్డెన్ టెంపుల్ నిలిచింది.

1 / 5
వెల్లూరులో ఉన్న గోల్డెన్ టెంపుల్ మరో అరుదైన రికార్డ్‌ని సొంతం చేసుకుంది. తిరుపతి, కాణిపాకం దర్శనాలకు వెళ్లే భక్తులు తప్పనిసరిగా విజిట్ చేస్తున్న ఆలయాల్లో ఒకటిగా గోల్డెన్ టెంపుల్ నిలిచింది.

వెల్లూరులో ఉన్న గోల్డెన్ టెంపుల్ మరో అరుదైన రికార్డ్‌ని సొంతం చేసుకుంది. తిరుపతి, కాణిపాకం దర్శనాలకు వెళ్లే భక్తులు తప్పనిసరిగా విజిట్ చేస్తున్న ఆలయాల్లో ఒకటిగా గోల్డెన్ టెంపుల్ నిలిచింది.

2 / 5
ఈ ఆలయంలో బంగారు లక్ష్మీదేవి విగ్రహంతో పాటు, ప్రపంచంలోనే అతిపెద్ద 1,700 కిలోల వెండి శ్రీ శక్తి గణపతి విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. 2021 జనవరి 25వ తేదీన ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు.

ఈ ఆలయంలో బంగారు లక్ష్మీదేవి విగ్రహంతో పాటు, ప్రపంచంలోనే అతిపెద్ద 1,700 కిలోల వెండి శ్రీ శక్తి గణపతి విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. 2021 జనవరి 25వ తేదీన ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు.

3 / 5
తాజాగా ఇప్పుడు ఈ శక్తి గణపతి విగ్రహానికి అలంకరించిన కిరీటం అంతకంటే విశిష్టమైనదిగా నిలుస్తోంది. ఈ కిరీటంలో పొదిగిన అరుదైన వైఢూర్యం ప్రపంచంలోనే అతి పెద్ద వైఢూర్యంగా రికార్డ్‌ క్రియేట్‌ చేస్తోంది. ఈ వజ్రం దాదాపు 880 క్యారెట్ల బరువు ఉంది. ఇప్పటివరకూ ప్రపంచ రికార్డ్స్‌లో నిలిచిన అతిపెద్ద వైఢూర్యం బరువు 700 క్యారెట్లు మాత్రమే.

తాజాగా ఇప్పుడు ఈ శక్తి గణపతి విగ్రహానికి అలంకరించిన కిరీటం అంతకంటే విశిష్టమైనదిగా నిలుస్తోంది. ఈ కిరీటంలో పొదిగిన అరుదైన వైఢూర్యం ప్రపంచంలోనే అతి పెద్ద వైఢూర్యంగా రికార్డ్‌ క్రియేట్‌ చేస్తోంది. ఈ వజ్రం దాదాపు 880 క్యారెట్ల బరువు ఉంది. ఇప్పటివరకూ ప్రపంచ రికార్డ్స్‌లో నిలిచిన అతిపెద్ద వైఢూర్యం బరువు 700 క్యారెట్లు మాత్రమే.

4 / 5
సహజంగా నవరత్నాలకు ప్రత్యేక శక్తులు కలిగి ఉంటాయి. తొమ్మిది గ్రహాలలోని శక్తులు అక్కడ  ప్రసరింపజేస్తాయి అని భక్తుల నమ్మకం. ఆ విధంగా, నవరత్నాలలో ఒకటైన వైడూర్యం కేతు భగవాన్ శక్తిని ప్రసరింపజేస్తుందని కిరీటం ఏర్పాటు సందర్భంగా శ్రీ శక్తి అమ్మ స్పష్టం చేశారు.

సహజంగా నవరత్నాలకు ప్రత్యేక శక్తులు కలిగి ఉంటాయి. తొమ్మిది గ్రహాలలోని శక్తులు అక్కడ ప్రసరింపజేస్తాయి అని భక్తుల నమ్మకం. ఆ విధంగా, నవరత్నాలలో ఒకటైన వైడూర్యం కేతు భగవాన్ శక్తిని ప్రసరింపజేస్తుందని కిరీటం ఏర్పాటు సందర్భంగా శ్రీ శక్తి అమ్మ స్పష్టం చేశారు.

5 / 5
ఎవరైతే ఎంతో విలువైన వైఢూర్యాలను కొనుగోలు చేసి ధరించలేని భక్తులు ఈ గణపతిని దర్శించుకుని ఆశీర్వాదం పొందవచ్చని శ్రీ శక్తి అమ్మ చెప్పారు. కాగా, తిరుపతి, కాణిపాకం దర్శనాలకు వెళ్లే భక్తులు చాలా వరకు ఈ ఆలయాన్ని తప్పక సందర్శిస్తుంటారు.

ఎవరైతే ఎంతో విలువైన వైఢూర్యాలను కొనుగోలు చేసి ధరించలేని భక్తులు ఈ గణపతిని దర్శించుకుని ఆశీర్వాదం పొందవచ్చని శ్రీ శక్తి అమ్మ చెప్పారు. కాగా, తిరుపతి, కాణిపాకం దర్శనాలకు వెళ్లే భక్తులు చాలా వరకు ఈ ఆలయాన్ని తప్పక సందర్శిస్తుంటారు.