
భారతదేశంలో ఆసేతు హిమచాలంలో ఎక్కువ మంది శాకాహారులున్నారు. అయితే గుజరాత్, హర్యానా, రాజస్థాన్ వంటి రాష్ట్రాలను శాకాహార రాష్ట్రాలుగా భావిస్తారు. ఈ రాష్ట్రాల్లో నివసించే ఎక్కువ మంది ప్రజలు శాఖాహారం తింటారు. ఈ రాష్ట్రాల్లో మాంసాహారం తినేవారి సంఖ్య అత్యల్ప శాతం ఉన్నట్లు భావిస్తున్నారు. అయితే దేశంలో కొన్ని నగరాల్లో అసలు మాంసాహారం తినడానికి అనుమతి లేదు. ఆ నగరాలు ఏమిటో ఈ రోజు తెలుసుకుందాం..

రిషికేశ్, ఉత్తరాఖండ్: గంగా నది తీరంలో ఉన్న పవిత్రనగరం రిషికేశ్. ఆధ్యాత్మికంగా విశిష్ట స్థానం ఉన్న ఈ నగరానికి ఎక్కువ మంది మానసిక ప్రశాంతత కోసం, మోక్షం కోసం వస్తారు. ఈ నగరం చుట్టూ ముళ్ల చెట్లు.. పచ్చని పచ్చని కొండలు మాత్రమే కనిపిస్తాయి. ఇది దేవాలయాల నగరం. ఇక్కడ చాలా మంది ఆధ్యాత్మిక ప్రశాంతత కోసం వస్తారు కనుక ఇక్కడ నాన్ వెజ్ ఫుడ్ నిషిద్ధం. శాఖాహారం మాత్రమే దొరుకుతుంది.

వారణాసి, ఉత్తరప్రదేశ్: పవిత్ర గంగానదీ తీరంలో ఉన్న అతి పురాతన నగరం వారణాసి. ఈ నగరాన్ని బెనారస్ లేదా కాశీ అని కూడాపిలుస్తారు. ఇది శివుని నివాసం. ఎందుకంటే ఈ నగరం శివుడు నిర్మించడానికి నమ్మకం. ఇక్కడ రుచిగా శుచిగా ఉండే అన్ని రకాల శాకాహార ఆహార పదార్ధాలను తినొచ్చు.

హరిద్వార్, ఉత్తరాఖండ్: పవిత్ర గంగా నది తీరాన్న వెలసిన నగరం హరిద్వార్. ఈ నగరం భారతదేశంలోని పవిత్ర నగరాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. వేయించిన ఆహారం నుంచి సలాడ్లు, సూప్ల వరకు అన్ని రకాల శాఖాహార ఆహారాలను ఇక్కడ ట్రై చేయవచ్చు.

మధురై, తమిళనాడు: తమిళనాడు నడిబొడ్డున ఉన్న ఈ నగరాన్ని ఆ రాష్ట్ర గుండె అని కూడా అంటారు. ఈ నగరం పూర్తిగా శాకాహారం. అయితే ఈ నగరం భారతదేశంలోని అసలైన సుగంధ ద్రవ్యాలతో నిండి ఉంటుంది. అత్యంత రుచికరమైన, పోషకమైన శాఖాహార వంటకాలను అందిస్తుంది.

అయోధ్య, ఉత్తరప్రదేశ్: హిందువుల ఆరాధ్య దైవం శ్రీ రాముని జన్మస్థలం అయిన అయోధ్యలో కూడా మాంసాహారం దొరకదు. అయోధ్య పురి భారతదేశం మొత్తంలో అత్యంత పవిత్రమైన ప్రదేశంగా పరిగణించబడుతుంది. అయోధ్యలో మాంసాహారాన్ని అందించే ఒక్క రెస్టారెంట్ కూడా లేదు.

పాలిటానా, గుజరాత్: ఈ నగరం కూడా పూర్తి శాకాహారమే.. మన దేశంలో మాత్రమే కాదు ప్రపంచ వ్యాప్తంగా మొదటి శాకాహార నగరంగా ప్రసిద్దిగంచింది. అందుకనే శాకాహారులకు స్వర్గధామం. ఎందుకంటే ఈ ప్రదేశంలో నివసించే చాలా మంది ప్రజలు కఠినమైన శాఖాహారులుగా ప్రసిద్ధి చెందిన జైనులు. అందువల్ల ఈ నగరంలో పూర్తిగా శాఖాహార ఆహారాన్ని మాత్రమే అందిస్తారు.

బృందావన్, ఉత్తర ప్రదేశ్: ఇది మధుర జిల్లాలో ఉన్న ఒక చారిత్రక నగరం, మతపరమైన ప్రాముఖ్యతను కలిగి ఉన్న ప్రదేశం. శ్రీకృష్ణుడు తన బాల్యాన్ని ఎక్కువ కాలం గడిపిన ప్రదేశం. నగరం పవిత్రత కారణంగా, ఇక్కడ గుడ్లు, మాంసాహార అమ్మకాలు నిషేధించబడ్డాయి. అందువల్ల ఈ ప్రదేశంలో మాంసాహారం దొరకదు.