
రామ మందిర అలంకరణ కోసం 50 వేల కిలోలకు పైగా పూలను అయోధ్యకు తీసుకొచ్చారు. ఆలయ స్తంభాలను పూలతో అలంకరించారు. దేశంలోని నలుమూలల నుంచి ఈ పూలు వచ్చాయి.


రామాలయం స్తంభాలను రంగు రంగుల పువ్వులతో బహుసున్దరంగా అలంకరించారు. సప్త వర్ణాల సంగమం ఈ పువ్వుల కలయిక అనిపిస్తుంది.

రకరకాల బంతి పువ్వులు అలంకరణలో ప్రముఖ స్థానాన్ని చోటు చేసుకున్నాయి. వీటితో పాటు ఎరుపు, పసుపు, ఆకుపచ్చ, నీలం రంగుల పూలను వాడారు.

మందిర నిర్మాణంలో భాగంగా లోపల ఎ విధమైన డిజైన్స్ చేశారో.. అదే విధంగా పువ్వులను ఏర్పాటు చేస్తూ.. గుడి అందంగా, గ్రాండ్గా కనిపించేలా అలంకరిస్తున్నారు.

పూల అలంకరణతో పాటు ఆలయం లోపల ప్రతి స్తంభంపైన దీపాలంకరణ కూడా అద్భుతంగా కనిపిస్తుంది. వివిధ స్తంభాలను వివిధ రకాల లైటింగ్లతో అలంకరించారు.

మరికొన్ని గంటల్లో అయోధ్యలో బాల రాముడు గర్భ గుడిలో కొలువుదీరనున్నాడు. ఈ నేపధ్యంలో రామ మందిరంతో పాటు అయోధ్య మొత్తం సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది.

నగరంలోని ప్రధాన కూడళ్లు, వివిధ ప్రాంతాలను కూడా అందంగా అలంకరించారు.

ప్రధాని నరేంద్ర మోడీ తో పాటు దేశంలోని పలువురు ప్రముఖులు కూడా రామమందిర ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఆలయం లోపల చేసిన అలంకరణ కంటే బయట చాలా ఎక్కువ అలంకరణ చేశారు.