
ఏలూరు : గల్ఫ్ ప్రాంతంలో పెరుగుతున్న ఉద్రిక్తతల ప్రభావం ఇప్పుడు భారతీయ మార్కెట్లపై కూడా కనిపిస్తోంది. ముఖ్యంగా పిస్తా, అంజీర్ (అత్తి పండ్లు), కిస్మిస్ వంటి డ్రై ఫ్రూట్స్ ధరలు పెరగటం తో కొనుగులు దారులు పెదవి విరుస్తున్నారు. భారత్ పెద్ద మొత్తంలో పిస్తాలను ఇరాన్ తో పాటు అమెరికాలోని కాలిఫోర్నియా నుండి దిగుమతి చేసుకుంటుంది.

ప్రస్తుత సంక్షోభం కారణంగా ఇరాన్ నుండి సరఫరా నిలిచిపోయింది, దీనివల్ల పిస్తా ధరలు పెరిగాయి. పశ్చిమగోదావరి జిల్లా తణుకులో హోల్ సెల్ వ్యాపారులు ఇప్పటికే ధరలను పెంచారు. రానున్న వారాల్లో మరింతగా ధరలు పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.

కేజీ 2000 ఉన్న పిస్తా ప్రస్తుతం 2200 అమ్ముతున్నారు. అదేవిధంగా కేజీ పిస్తా సాల్ట్ 1100 లో ఉన్న రేటు 200 పెంచి 1300కి అమ్ముతున్నారు. రూ. 150 ఉన్న ఖర్జూరం 200 లకు పెరిగింది. బాదం కేజీ 700 నుంచి 180 చేరుకుంది. అంజురా కేజీ వెయ్యి రూపాయలు ఉండగా అదనంగా మరో 100 పెంచి విక్రయిస్తున్నారు.

రంజాన్ మాసం కావటంతో డ్రై ఫ్రూట్స్ వినియోగం ఎక్కువగా ఉంటుంది. అదేవిదంగా నాన్ వెజ్ వంటలు, డ్రై ఫ్రూట్ జ్యూస్ రూపంలో నూ మనప్రాంతంలో ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఈ నెలలో ఉగాది , శ్రీరామ నవమి పండుగలు ఎక్కువగా ఉండటం తో డ్రై ఫ్రూట్స్ వినియోగం ఎక్కువగా ఉంటుందని కొనుగోలుదారులు చెబుతున్నారు.

ఇరాన్లోని బందర్ అబ్బాస్ , చబహార్ ఓడరేవులు యుద్ధం కారణంగా మూసివేయబడటంతో అక్కడి నుండి జరిగే ఎగుమతులు పూర్తిగా నిలిచిపోయాయి. ఓడరేవులు మూతపడటంతో డ్రై ఫ్రూట్స్ స్టాక్ నిలిచిపోయింది ఇవి భారతదేశానికి సముద్ర మార్గం ద్వారానే వస్తాయని వ్యాపారులు చెబుతున్నారు. మరోవైపు ఇప్పటికే భారత్, పాకిస్థాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా ఆఫ్ఘనిస్థాన్ నుండి రావాల్సిన సరుకుపై కూడా ప్రభావం పడింది.