
లేపాక్షి లో గల వీరభద్ర దేవాలయం లో 15 అడుగుల ఎత్తు,22 అడుగుల పొడుగున విస్తరించి ఉన్న బ్రహ్మాండమైన విగ్రహం ఇది .

108 శైవ క్షేత్రాల్లో లేపాక్షి ఒకటి అని స్కాందపురాణం తెలియ చేస్తుంది . ఇక్కడ గల పాపనాశేశ్వర స్వామి ని అగస్త్య మహర్షి ప్రతిష్టించారని ప్రతీతి . ఒకరికి ఒకరు ఎదురుగా పాపనాశేశ్వరుడు,రఘునతముర్తి ఉండటం ఇక్కడ ప్రత్యేకత.

విజయనగర రాజుల కాలం లో నిర్మించిన ఈ దేవాలయం చక్కటి శిల్పకళకు ,రమనియమనైన ప్రదేశం .సీతమ్మవారని అపహరించుకొని పోతున్న రావణాసురునితో యుద్ధం చేసి జటాయువు ఇక్కడే పడిపోయాడని, రాముల వారు జటాయువు చెప్పిన విషయమంత విని కృతజ్ఞతతో లే ! పక్షి ! అని మోక్షం ప్రాసదించిన స్థలం . అందువల్లనే క్రమంగా లేపాక్షి అయ్యింది అని స్థల పురాణం చెబుతుంది

పట్టణ ప్రవేశంలో ఉన్న ఒక తోటలో ఉన్న అతిపెద్ద ఏకశిలా నంది విగ్రహం ఠీవిగా కూర్చున్న భంగిమలో ఉంటుంది. ఇక్కడికి 200 మీ. దూరంలో మధ్యయుగం నాటి నిర్మాణ కళతో కూడిన ఒక పురాతన శివాలయం ఉంది.

వేలాడే స్తంభం ముఖ్య ఆకర్షణ. ఇక్కడికి వచ్చే సందర్శకులను ఆకట్టుకొంటోంది. ఇక్కడికి వచ్చిన వారు అందరు ఈ అద్భుతాన్ని చూసి, వారు కూడా వేలాడే స్తంభాన్ని పరీక్షిస్తుంటారు. ఈ వేలాడే స్థంభం ఏ ఒక్క స్తంభం పడిపోకుండా అన్ని స్తంభాలను కట్టడి చేస్తుందంట