మధ్యప్రదేశ్ రాష్ట్రం మోరేనా జిల్లాలో దట్టమైన అరణ్య ప్రాంతంలో పకృతి అందాల నడుమ ఎత్తైన కొండపై ఉన్న ఈశ్వర మహాదేవ్ ఆలయంలో ఉంది. ఈ ఆలయం గర్భగుడిలో రోజూ ఓ వింత జరుగుతుంది. పూజారి వేకువ జామున ఆలయ గర్భగుడి తలుపులు తీసే సమయానికి ఎవరో స్వామివారిని పుష్పాలు, బిల్వదళాలతో పూజించి వెళ్లిపోయిన ఆనవాలు కనిపిస్తాయి.
లింగ స్వరూపుడైన స్వామివారిని ఎవరు వచ్చి స్వామివారికి పూజిస్తున్నారు అనేది ఎవరికీ అంతుబట్టదు. వేసిన తలుపులు వేసినట్లే ఉంటాయి. పూజ చేసి వెళ్లినట్లు స్పష్టమైన ఆధారం కనబడుతుంటుంది.
తెల్లవారు జామున 4 గంటలకు ఓ సిద్ధ యోగి స్వామివారిని పూజిస్తుంటారని స్థానికులు చెబుతుంటారు. అయితే అలా పూజ చేస్తున్న స్వామి ఎవరనేది ఇప్పటికీ కనిపెట్టలేకపోయారు.
ఈ ఆలయంలో మరో విశేషం ఏమిటంటే ఏడాది పొడవునా 365 రోజులు సహజ సిద్ధంగా శివలింగంపైన నీరు పడుతూనే ఉంటుంది.
ఇక్కడ శివలింగాన్ని రావణుడి తమ్ముడైన విభీషణుడు ప్రతిష్టించారని పురాణాల కథనం శివలింగాన్ని ప్రతిష్టించిన విభీషణుడు రోజూ వచ్చి శివుడి పూజార్చన చేస్తున్నారని అక్కడి స్థానికుల నమ్మకం.
రాందాస్ జీ మహారాజ్ అనే సన్యాసి గతంలో ఇక్కడ తపస్సు చేశారనీ, అయితే ఆయన శరీరాన్ని వదిలిపెట్టినప్పటికీ అదృశ్య రూపంలో రోజూ లింగానికి పూజలు చేస్తున్నారని మరో కథనం