ద్వారకాధీష్ ఆలయం, మధుర: మధురలోని అత్యంత ప్రసిద్ధ కృష్ణ దేవాలయం. ఈ ఆలయంలో కృష్ణుడి నలుపు రంగులో దర్శనమిస్తాడు. ఈ ఆలయం శ్రీకృష్ణుడు జన్మించిన యమునా నది ఒడ్డున ఉన్న జైలు గదిలో ఉంది. ఈ ఆలయంలోని గదిలో శ్రీకృష్ణుడు జన్మించాడని ప్రతీతి. ఈ ఆలయాన్ని ద్వారకాధీష్ దేవాలయం అని కూడా అంటారు. ఈ పవిత్రమైన ఆలయాన్ని చూడటానికి ప్రతి సంవత్సరం లక్షలాది మంది ప్రజలు మధురకు వస్తుంటారు. ఈ పురాతన ఆలయ నిర్మాణశైలి చూడదగ్గది. ద్వారకాధీష్ ఆలయాన్ని సందర్శించిన తర్వాత ఎవరికైనా శాంతి పొందిన అనుభూతి కలుగుతుంది.
శ్రీ బాంకే బిహారీ దేవాలయం, బృందావన్: శ్రీ కృష్ణ భగవానుడు మధురలో జన్మించాడు. అయితే అతని బాల్యం బృందావనంలో గడిచింది. శ్రీ కృష్ణ భగవానుడు బంకే బిహారీ అని కూడా పిలువబడ్డాడు. అందుకే ఈ ఆలయంలోని స్వామి శ్రీ బాంకే బిహారీగా ప్రసిద్ధిగాంచాడు. శ్రీ కృష్ణుడు తన చిన్నతనంలో బృందావనంలో మాత్రమే ఎన్నో చిలిపి చేష్టలు , రాసలీలలు చేసాడు. బృందావన్లో ఇస్కాన్ ఆలయం, ప్రేమ మందిరం, బాంకే బిహారీ ఆలయం కూడా సందర్శించదగినవి. జన్మాష్టమి సందర్భంగా ఈ ఆలయాలకు భారీగా కన్నయ్య భక్తులు తరలివస్తారు.
ఉడిపి శ్రీ కృష్ణ మఠం ఆలయం, కర్ణాటక: శ్రీ కృష్ణ మఠం ఆలయం కన్నయ్య ప్రసిద్ధ దేవాలయాలలో ఒకటి. ఈ ఆలయాన్ని వైష్ణవ సన్యాసి శ్రీ మాధవాచార్యులు 13వ శతాబ్దంలో స్థాపించారు. ఈ ఆలయ కిటికీలో ఉన్న తొమ్మిది రంధ్రాల ద్వారా భక్తులు శ్రీకృష్ణుని దర్శనం చేసుకుంటారు. ఈ కిటికీని అద్భుత కిటికీ అంటారు. ప్రతి సంవత్సరం శ్రీ కృష్ణాష్టమి రోజున ఇక్కడికి భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఆలయమంతా పూలతో, దీపాలతో అలంకరిస్తారు. దర్శనం కోసం భక్తులు 3-4 గంటల పాటు వేచి ఉండాల్సి సందర్భం కూడా ఉంటుంది.
ద్వారకాధీష్ ఆలయం, గుజరాత్: ఈ దేవాలయం గుజరాత్లోని అత్యంత ప్రసిద్ధ కృష్ణ దేవాలయంగా పరిగణించబడుతుంది. ఈ ఆలయాన్ని జగత్ మందిర్ అని కూడా అంటారు. గుజరాత్లోని ఈ ద్వారకాధీష్ దేవాలయం హిందూ మతానికి సంబంధించిన చార్ ధామ్లో ఒకటి. ఈ ఆలయం నాలుగు ధాములలో అత్యంత సుందరమైనది. పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఈ ద్వారకాధీష్ దేవాలయం గోమతి క్రీక్ (గోమతి ఘాట్) మీద ఉంది. దీనిని 43 మీటర్ల ఎత్తులో నిర్మించారు. ఈ ఆలయాన్ని సందర్శించకపోతే, చార్ ధామ్ యాత్ర సంపూర్ణం కానట్లు భావిస్తారు. జన్మాష్టమి రోజున ఇక్కడి ఉండే సందడి గురించి ఎంత చెప్పినా తక్కువే.
జగన్నాథ స్వామి పూరి, ఒరిస్సా: ఒడిశాలోని పరివిత్ర పుణ్యక్షేత్రం పురిలోని జగన్నాథ ఆలయం. ఇక్కడ శ్రీకృష్ణుడు తన సోదరుడు బలరాముడు, సోదరి సుభద్రతో కలిసి భక్తులతో పూజలను అందుకుంటున్నాడు. జన్మాష్టమి కంటే ఈ క్షేత్రంలో జరిగే రథయాత్ర ప్రపంచ ప్రఖ్యాతి గాంచింది. ఈ రథయాత్రకు హిందూ మతపరంగా చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. ఈ రథయాత్రలో పాల్గొనడానికి, జగన్నాథుని రథాన్ని లాగడానికి ప్రపంచం నలుమూలల నుండి లక్షలాది మంది భక్తులు చేరుకుంటారు. జగన్నాథుడు, తన సోదరి, అన్న తో కలిసి చేసే ప్రయాణం కోసం మూడు భారీ రథాలు సిద్ధం చేస్తారు. ఈ ప్రయాణంలో బలరాముడు అధిరోహించే రథం ముందు వరుసలో ఉంటుంది.. అనంతరం సోదరి సుభద్ర రథం.. శ్రీకృష్ణుడి రథం ప్రయాణిస్తాయి.