
కేతు గ్రహం మఖా నక్షత్రంలోని మూడవ పాదంలోకి ప్రవేశించనుంది. కేతు సంచారంలో మార్పు రాశులపై చాలా ప్రభావాన్ని చూపుతుంది. అయితే ఇది మే 29, శుక్ర వారం రోజున మఖ నక్షత్రం మూడవ పాదంలోకి సంచరిస్తుంది. జూన్ 30 వరకు అందులో ఉంటుంది. అయితే ఈ సమయంలో నాలుగు రాశుల వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు తలెత్తే ఛాన్స్ ఉన్నదంట. ముఖ్యంగా ఆరోగ్యం చాలా దెబ్బతినే ఛాన్స్ ఉందని చెబుతున్నారు పండితులు.

మిథున రాశి : మిథున రాశి ఆర్థిక సమస్యలు ఎక్కువ అవుతాయి. ముఖ్యంగా అనారోగ్య సమస్యలు అధికం అవుతాయి. చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆర్థికంగా, ఆరోగ్య పరంగా అన్ని విధాలుగా పురోగతి తగ్గుతుంది. సవాళ్లు అధికం అవుతాయి. తలకు సంబంధించిన సమస్యలు ఇబ్బందులకు గురి చేస్తాయి. అందువలన ఆర్థికంగా ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది.

కన్యా రాశి : కన్యారాశి వారికి మానసిక ప్రశాంతత లోపిస్తుంది. మానసిక ఒత్తిడి అధికం అవుతుంది. అంతే కాకుండా ఎంత కష్టపడినా ఫలితం అంతగా ఉండకపోవచ్చును. ఈ రాశి వారు ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఉండనున్నాయి కాబట్టి, ఖర్చుల విషయంలో జాగ్రత్త అవసరం.

మీన రాశి : మీన రాశి వారు ఆర్థికంగా చాలా నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అప్పుల బాధలు, అనారోగ్య సమస్యలు ఎక్కవ అవుతాయి. ఏ పని మొదలు పెట్టినా అది మధ్యలోనే ఆగిపోతుంది. అంతే కాకుండా, ఉద్యోగులకు జాబ్ పోయే ఛాన్స్ ఉంది. అందువలన కార్యాలయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించడం చాలా మంచిది.

వృషభ రాశి : కేతు గ్రహాన్ని నీడ గ్రహం, కీడు గ్రహం అని కూడా అంటారు. అయితే ఈ గ్రహం మఖ నక్షత్రం మూడవ పాదంలోకి అడుగు పెట్టడం వలన వృషభ రాశి వారు అనేక సమస్యలు ఎదుర్కుంటారు. ముఖ్యంగా వీరికి మానసిక ఇబ్బందులు ఎక్కువ అవుతాయి. ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. ఖర్చులు అధికం అవుతాయి. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.