
ఈ సంవత్సరంలో ఏప్రిల్ 23న కామద ఏకాదశి వచ్చింది. సమయం ఏప్రిల్ 22న రాత్రి 11.35 గంటలకు ప్రారంభమై.. ఏప్రిల్ 23 రాత్రి 9.47 గంటలకు ముగుస్తుంది. ఏకాదశి పరానా సమయం ఉదయం 5.09 నుంచి 7.43 మధ్య ఉంటుంది.

ప్రత్యేకత.. పూర్వం పుండరీకుడు అనే రాజు కొలువులో, ఓ గంధర్వుడు ఉండేవాడు. కసారి ఆ గంధర్వుడు తన పట్ల నిర్లక్యంగా వ్యవహరించాడనే కోపంతో, రాక్షసుడిగా మారిపొమ్మని ఆ రాజు శపిస్తాడు. దాంతో ఆ గంధర్వుడు .. రాక్షసుడిగా మారిపోయి సంచరిస్తుంటాడు.

అప్పుడు ఆ గంధర్వుడి భార్య 'కామద ఏకాదశి' వ్రతాన్ని ఆచరిస్తుంది. ఆ వ్రత పుణ్య ఫలం చేత ఆ గంధర్వుడు యథా రూపాన్ని పొందుతాడు.1

అందుకే ఈ పవిత్రమైన రోజున మహిళలు తమ సౌభాగ్యాన్ని కాపాడాలని ఆ విష్ణువుకు పూజలు చేస్తుంటారు. తమ కుటుంబానికి ఆయురారోగ్యాలు ప్రసాదించమని ప్రార్ధిస్తారు.

ఈరోజున కొంతమంది మహిళలు నోములు, వ్రతాలు చేస్తూ. ఉపవాసం, జాగరణ ఉంటారు.

ఈరోజున చేసే వ్రతం వలన స్త్రీలకు సౌభాగ్యం స్థిరంగా ఉంటుందని పండితులు చెబుతుంటారు. పురాణాల ప్రకారం వరహా పురాణంలో శ్రీకష్ణుడు యుధిష్టరునికి కామద ఏకాదశి విశిష్టతను వివరించాడట.

మనం తెలియక చేసే పాపాలన్నీ ఈ ఒక్క ఏకాదశి రోజున చేసే పూజ, ఆచరించే వ్రతం, ఉపవాసం ఉండటం వల్ల పోతాయని పురాణాలల్లో ఉంది.

కామద ఏకాదశి 2021