
చుట్టూ పచ్చని పొలాలు, ప్రకృతి రమణీయ దృశ్యాలు, మరోవైపు గోదావరి నదికి నెలవైన ఈ పిఠాపురం ప్రస్తావన పురాణాల్లో కూడా ఉంది. ఏ ఊరు పూర్వం బుద్ద రాజధానిగా ఉండేది. అందుకనే పిఠాపురాన్ని పాదగయ అని కూడా అంటారు. ఇక్కడ ఉన్న తటాకాన్ని పాదగయ తీర్ధమని అంటారు.

పాదగయ తీర్ధం వద్ద గయాసురుని పాదాలున్నాయి. కనుక ఇక్కడ పెద్దలకు శ్రాద్ధకర్మలు నిర్వహిస్తే.. పుణ్యలోకం ప్రాపిస్తుందని నమ్మకం

పాదగయ కోనేరుకు ముందు తూర్పుముఖంగా కుక్కుటేశ్వర దేవాలయం ఉంటుంది. గుడికి ఎదురుగా పెద్ద ఏకశిల నంది విగ్రహం ఉంటుంది. ఈ నంది శ్రీశైలంలోని నందిని పోలి ఉంటుంది. ఇక గర్భాలయంలో కొలువైన కుక్కుటేశ్వర స్వామి లింగం తెల్లగా ఉంటారు.. స్వచ్ఛమైన మనసుతో కోరి కొలిచినవారి కోర్కెలు తీరుస్తున్నాడు భోళాశంకరుడు

కుక్కుటేశ్వర ఆలయానికి ఇరువైపులా పురూహూతికా అమ్మవారి ఆలయం, శ్రీపాదుల ఆలయాలు ఉన్నాయి. ఈ గుడి చాలా చిన్నది. అయినప్పటికి అష్టాదశ శక్తీ పీఠాల శిల్పాలు చెక్కబడి ఎంతో అందంగా ఉంటుంది.

పిఠాపురం దత్త క్షేత్రాల్లో ప్రాముఖ్య క్షేత్రం. శ్రీ గురు దత్తాత్రేయుని ప్రథమ అవతారమైన 'శ్రీ పాద శ్రీ వల్లభ. స్వామి ఈ క్షేత్రంలో జన్మించారు.

శ్రీ కుక్కుటేశ్వర దేవాలయంలో శ్రీ దత్తాత్రేయ స్వామి స్వయంభూ విగ్రహరూపంలో దర్శనం ఇస్తారు. భారతదేశంలో దత్తాత్రేయుని స్వయంభూ విగ్రహం కేవలం పిఠాపురంలో మాత్రమే ఉంది. మిగతా దత్త క్షేత్రాల్లో స్వామివారి పాదుకలు మాత్రమే పూజలను అందుకుంటాయి.

త్రిగయా క్షేత్రాల్లో ఒకటైన పాదగయ క్షేత్రం.. పితృ ముక్తి కరమ క్షేత్రంగా ఖ్యాతిగాంచింది. ఈ ఆలయానికి చేరుకోవడానికి బస్సు సౌకర్యం ఉంది. ఇక రైలు మార్గంగా ద్వారా చేసుకోవాలంటే సమీపంలో సామర్లకోట రైల్వే జంక్షన్ వద్ద దిగాల్సి ఉంది. పిఠాపురం నుండి కేవలం 10 కిలోమీటర్ల దూరంమాత్రమే