
నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారిని ఒకొక్క అలంకరణలో ముస్తాబు చేస్తారు. అయితే ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా పేర్లు ఉన్నాయి. మొదటి రోజు పాడ్యమీ నాడు శైల పుత్రి, కనక దుర్గాదేవిగా పూజలను అందుకుంటుంది.

రెండో రోజు విదియ బ్రహ్మచారిణి, శ్రీ బాల త్రిపుర సుందరి

మూడోరోజు తదియ రోజున చంద్రఘంటాదేవి, శ్రీ అన్నపూర్ణ దేవి

నాలుగో రోజు చవితి నాడు కూష్మాండాదేవి, శ్రీ గాయత్రి దేవి

ఐదో రోజు పంచమి నాడు స్కందమాత,శ్రీ లలిత త్రిపుర సుందరి

ఆరో రోజు షష్టి నాడు కాత్యాయినీ, శ్రీ మహాలక్ష్మి దేవి

ఏడో రోజున సప్తమి నాడు కాళరాత్రి, శ్రీ సరస్వతి దేవి

ఎనిమిదోరోజు అష్టమి నాడు శ్రీ దుర్గాదేవి, మహాగౌరి,

తొమ్మిదో రోజు నవమి నాడు శ్రీ మహిససురమర్ధిని దేవి, సిద్ధిధాత్రిదేవి .. నవరాత్రుల్లో వివిధ ప్రాంతాల్లో అమ్మవారిని వివిధ పేర్లతో అలంకారాలు చేసి పూజిస్తారు. అమ్మవారి పేర్లు వేరైనా భక్తుల భక్తి ఒకటే.. నమ్మి కొలిచేవారికి అమ్మవారి అనుగ్రం ఒకటే.