
ఒక వ్యక్తి మరణించినప్పుడు ఎంత ఘనంగా వేడుక జరిపిస్తారో, అలాగే మరణించినప్పుడు కూడా అంత కంటే పెద్దగా కార్యక్రమాలు చేస్తారు. ఇక మరణం గురించి చాలా మందిలో అనేక సందేహాలు ఉంటాయి. ముఖ్యంగా దీని గురించి గరుడ పురాణం అనేక విషయాలను తెలియజేయడం జరిగింది. అయితే ఒక వ్యక్తి మరణించినప్పుడు అతని ముక్కు, చెవులలో దూది పెట్టడం జరుగుతుంది. కాగా దాని గురించి తెలుసుకుందాం.

ఒక వ్యక్తి శరీరం నవ రంధ్రాలతో నిర్మితమై ఉంటుంది అంటారు. ముఖ్యంగా వీటిలో ఏదో ఒక దాని ద్వారా వ్యకి తన జీవాన్ని విడిచి వెళ్తారని పురాణాలు చెప్తుంటాయి. అయితే చాలా వరకు శరీం తన ఆత్మను విడిచిన తర్వాత అంత త్వరగా కోలుకోలేదంట. తన శరీరాన్ని తాను పొందడానికి అనేక ప్రయత్నాలు చేస్తుందని గరుడ పురాణం చెబుతుంది.

ముఖ్యంగా నవ ద్వారాలలో ఏదో ఒక దాని ద్వారా ఆత్మ తన శరీరంలోకి వెళ్లిపోవాలని ప్రయత్నం చేస్తుందంట. కానీ అలా వెళ్లకుండా ఉండేందుకు చెవులు, ముక్కులలో దూది పెడతారని కొన్ని పురాణాలు చెబుతున్నాయి.

ఇక సైన్స్ పరంగా కూడా దీనికి ఒక కారణం ఉన్నదంట. చనిపోయిన తర్వాత వ్యక్తి చెవి లేదా ముక్కు నుంచి ద్రవం లాంటిది బయటకు రావడం జరుగుతుంది. అయితే దానిని అడ్డుకోవడానికి, అది బయటకు రాకుండా చూడటం కోసం ముక్కు, చెవులలో దూది పెడతారంట. అంతే కాకుండా, ఇలా ముక్కులో చెవులలో దూది పెట్టడం వలన మృత దేహం పాడవకుండా ఉంటుందంట.

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు