మధుమేహం ఉన్నవారు అన్నం తినకూడదు. ఇందులో ఉండే కార్బోహైడ్రేట్లు షుగర్ లెవల్స్లో ఒక్కసారిగా స్పైక్ను కలిగిస్తాయి. అందుకే అన్నం తక్కువగా తినాలని వైద్యులు సూచిస్తున్నారు. బియ్యాన్ని నీటిలో నానబెట్టితినడం వల్ల కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ సాధారణ చక్కెరలుగా మారతాయి. దీంతో త్వరగా జీర్ణమవుతాయి. ఇది కడుపు ఉబ్బరం, జీర్ణ సమస్యలు దూరమవుతాయి. మనం తీసుకునే ఆహారం నుండి కూడా పోషకాలు చక్కగా అందుతాయి.
నానబెట్టిన బియ్యంతో వండిన అన్నాన్ని తీసుకుంటే శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయి. మనం రోజూ చేసే పనులని ఈజీగా చేయడానికి హెల్ప్ చేస్తుంది. అంతేకాకుండా ఖనిజాలు, విటమిన్లు ఎక్కువగా అందుతాయి. ఇది కాకుండా, దాని గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా ప్రభావితమవుతుంది. ఆహారంలోని కార్బోహైడ్రేట్లు రక్తంలో చక్కెర స్థాయిలను ఎంత త్వరగా పెంచుతాయో GI కొలుస్తుంది
అన్నం వండడానికి ముందు బియ్యం నానబెట్టడం మధుమేహ వ్యాధిగ్రస్తులకు కూడా మంచిది. ఇలా వండిన అన్నం మధుమేహ వ్యాధిగ్రస్తులు తింటే ఆరోగ్యంపై ఎలాంటి దుష్పరిణామాలు ఉండవు. నానబెట్టిన బియ్యం ఉడికిస్తే అన్నం తిన్న తర్వాత రక్తంలో చక్కెర స్థాయి పెరగదు.
సాధారణంగా కొంతమంది అన్నం తిన్న వెంటనే బరువు పెరుగుతారు. అందుకే చాలామంది అన్నం తినకుండా ఉంటారు. అన్నం వండే ముందు నానబెట్టడం వల్ల బరువు పెరగకుండా ఉంటారు. అంతేకాదు, నానబెట్టి బియ్యంతో వండడం వల్ల అన్నం ముద్దలా తయారు కాకుండా విడివిడిగా అవుతుంది.
నానబెట్టిన బియ్యంతో అన్నం వండితే మీకు సమయంతో పాటు గ్యాస్ కూడా ఆదా అవుతుంది. నానబెట్టి అన్నం వండటం వల్ల అన్నం కూడా ఎక్కువ అవుతుంది.