
ప్రస్తుతం ఎక్కడ చూసిన కల్తీ అయిపొయింది. ఎందుకంటే, తాజాగా ఉన్నట్టు రసాయనాలు వాడి ఫ్రెష్ గా ఉంచుతున్నారు. దీనికోసం ప్రమాదకర రసాయనాలను కూడా కలుపుతున్నారు. అయితే, చేపలు కొనేటప్పుడు అవి తాజావేనా లేక కుళ్ళిపోయినవా? ఇలా గుర్తించండి

ఒక అధ్యయనం ప్రకారం ప్రమాదకర రసాయనాలను కలపడం వలన అవి తాజాగా కనిపిస్తున్నాయి. వీటిని ఇలాగే తింటే, జీర్ణ సమస్యలు, క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉందని పరిశోధకులు చెబుతున్నారు.

కళ్లు: మీరు తీసుకునే చేప కళ్లను ఒకటికి రెండు సార్లు బాగా గమనించాలి. ఇక తాజా చేపలు అయితే కళ్లు మెరుస్తూ ఉంటాయి. కుళ్లిపోయిన చేప కళ్లు మసకగా కనిపిస్తాయి.అలాంటివి అస్సలు తినకండి.

పొలుసులు: తాజా చేపలు అయితే వాటి పొలుసులు ఎర్రగా ఉంటాయి. అవి వేరే రంగులోకి మారితే అవి నిల్వ ఉన్న చేపలు. అమ్ముకునే వాళ్లు వాటి పైన రంగు పూసి వాటిని అమ్మే అవకాశం ఉంది. కాబట్టి, జాగ్రత్తగా ఉండాలి.

వాసన: తాజా చేపలు అయితే మంచి వాసన వస్తాయి. నిల్వ ఉన్నవి అయితే కుళ్ళిన వాసన వస్తుంది. అప్పుడు మీరు వెంటనే గ్రహించాలి వీటిలో రసాయనాలు కలిపారు అని, ఏ వాసన లేకపోతే అది తాజాది.