1/5

Battery Engine Bike: దేశంలో ఇటీవల కాలంలో నిరంతరం పెట్రో ధరలు పెరుగుతుండటంతో.. వాటినుంచి తప్పించుకునేందుకు పలువురు రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు. ఈ క్రమంలో పెట్రోల్ ఇంజన్లకు బదులుగా బ్యాటరీలను బిగిస్తున్నారు.
2/5

Batterప్రస్తుతం ఇలాంటి సంఘటనలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు ఎలక్ట్రిక్ కార్లు, ద్విచక్రవాహనాలు కూడా అందుబాటులోకి వచ్చాయి. అయితే చాలామంది ఉన్న వాహనాలకు బ్యాటరీలను బిగిస్తూ పెట్రో భారం నుంచి తప్పించుకుంటున్నారని పలువురు పేర్కొంటున్నారు. y Bike
3/5

దీనికోసం సుమారు 10 వేల రూపాయలు ఖర్చవుతుందని మెకానిక్లు చెబుతున్నారు. బ్యాటరీ ప్రకారం.. ఛార్జీల ధర ఉంటుందని.. వేగం మాత్రం గంటకు 65-70 కి.మీ. ప్రయాణించవచ్చంటూ వెల్లడిస్తున్నారు.
4/5

పెట్రోల్ ఇంజిన్ను ఎలక్ట్రిక్గా మార్చేటప్పుడు.. గేర్ బాక్స్ తొలగించి, యాక్సిలరేటర్కు నేరుగా అనుసంధానం చేస్తారు. యాక్సిలేటర్ ద్వారా అంటే స్కూటీ లాగా వాహనాన్ని నియంత్రించవచ్చని తెలుపుతున్నారు. 2 గంటలపాటు బ్యాటరీని ఛార్జ్ చేసుకుంటే.. 40 కిలోమీటర్లు నడపవచ్చు.
5/5

ఇలాంటి వారు.. మరో విషయాన్ని మర్చిపోతున్నారు.. ఇలా చేస్తే.. చట్టవిరుద్ధమని.. కేసులు నమోదవుతాయని పోలీసులు వెల్లడిస్తున్నారు. మోటారు వాహన చట్టం 1988 లోని సెక్షన్ 52 ప్రకారం.. కేసుతోపాటు, జరిమానా విధిస్తారు. బీమాను కూడా క్యాన్సెల్ చేస్తారు.