- Telugu News Photo Gallery Science photos Chandrayaan 3 India celebrates first Moon landing on south pole Photo See
Chandrayaan 3 Landed: మామా నమస్తే.. భారత్ గుప్పిట చిక్కిన జాబిల్లి.. వాట్నెక్ట్స్ చంద్రయాన్-3..
Chandrayaan 3 Landed on Moon: ఇండియా ఈజ్ ఆన్ ది మూన్.. ఇదీ ఇస్రో వారి సగర్వ ప్రకటన. జాబిలి మీద కాలుమోపిన తమ చంద్రయాన్3 ప్రాజెక్ట్ సూపర్ సక్సెస్ కొట్టిందన్న వార్తను ప్రపంచానికి చాటిచెప్పుకుంది ఇస్రో. అగ్రరాజ్యాల్ని సైతం నోరెళ్లబెట్టేలా చేసిన ఈ ఘన విజయాన్ని దేశం మొత్తం ఆస్వాదిస్తోందన్నారు ప్రధాని మోదీ. మూన్ మిషన్లను చాలా దేశాలు విజయవంతం చేసుకున్నాయి. కానీ..
Updated on: Aug 23, 2023 | 9:15 PM

ఇన్నాళ్లు అందని జాబిలి.. ఇప్పుడు గుప్పిట చిక్కింది. చంద్రుడి మీద ప్రయోగంలో సంపూర్ణ విజయం సాధించి మళ్లీ మీసం మెలేసింది ఇస్రో. చంద్రుడి దక్షిణ ధ్రువం మీద రోవర్ని దింపిన తొలి దేశంగా అవతరించింది భారత్.

ఇస్రో అంచనాలు ఏమాత్రం తప్పలేదు. అంగుళమైనా పక్కకు జరగలేదు. గీసిన గీత మీద సరిగ్గా వాలింది చంద్రయాన్3. విక్రమ్ ల్యాండర్ నెలరేడుని ముద్దాడిందన్న శుభవార్త యావత్ దేశాన్నీ పులకింపజేసింది.

Chandrayaan 3

చంద్రునిపై ల్యాండ్ అవుతున్నప్పుడు చంద్రయాన్-3 ల్యాండర్ హారిజాంటల్ వెలాసిటీ కెమెరా ద్వారా బంధించబడిన చంద్రుని చిత్రాలను ఇస్రో విడుదల చేసింది. Ch-3 ల్యాండర్, MOX-ISTRAC, బెంగళూరు మధ్య కమ్యూనికేషన్ లింక్ ఏర్పడిందని ఇస్రో తెలిపింది.

చంద్రయాన్ 3 బుధవారం చంద్రుని ఉపరితలంపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసింది. ఈ ప్రక్రియను చూడటానికి, ప్రధాని మోదీ భారతదేశానికి 8 వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్బర్గ్ నుండి ఆన్లైన్లో కనెక్ట్ అయ్యారు. ఇది 140 కోట్ల భారతీయుల విజయం, అంతరిక్ష చరిత్రలో కొత్త అధ్యాయాన్ని లిఖించాం అంటూ ఇస్రోను అభినందించారు ప్రధాని మోదీ. చంద్రయాన్ విజయంతో తన జీవితం ధన్యమైందన్నారు.

చంద్రయాన్-3 ల్యాండర్ చంద్రుని దక్షిణ ధ్రువంపై విజయవంతంగా దిగింది. ఇప్పుడు మరికొద్ది సేపట్లో ప్రజ్ఞాన్ రోవర్ విక్రమ్ ల్యాండర్ లోపల నుండి బయటకు వచ్చి చంద్రునిపై పరిశోధన చేస్తుంది.

అసలు ఇస్రో రియల్ మిషన్ ఇప్పుడే మొదలయింది. దక్షిణ ధ్రువంపై దిగిన విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ 14 రోజుల పాటు అంటే 1 లూనార్ డే పాటు పనిచేస్తాయి. ఇక ప్రజ్ఞాన్ రోవర్ జాబిల్లి ఉపరితలంపైకి చేరుకున్నాక ఆ పరిసర ప్రాంతాల్లో 14 రోజుల పాటు పనిచేస్తుంది. మనకు 14 రోజులు అంటే చంద్రుడిపై ఒక్క పగలుతో సమానం అన్నమాట. ల్యాండర్, రోవర్లలో ఉన్న పేలోడ్లు తమ విధులని కొనసాగిస్తాయి. ల్యాండర్ చేసే పరిశోధనలు నేరుగా భూమ్మీద ఉన్న పర్యవేక్షణ కేంద్రంతో కమ్యూనికేట్ చేసినప్పటికీ.. రోవర్ మాత్రం ల్యాండర్కు మాత్రమే కమ్యూనికేట్ చేసే వీలుంది.




