
SBI Personal Loan:కరోనా మహమ్మారి కారణంగా చాలా మంది ఆర్థికంగా ఇబ్బందులు పడిపోయారు. దీంతో ఎస్బీఐ అద్భతమైన లోన్ ఆఫర్ను అందుబాటులోకి తీసుకువచ్చింది. కేవలం నాలుగు క్లిక్స్తో పర్సనల్ లోన్ ఇస్తామని ప్రకటించింది. గతంలో కస్టమర్లు లోన్ తీసుకోవాలంటే చాలా ఎన్నో ఇబ్బందులు పడి బ్యాంకుల చుట్టు తిరిగి లోన్ పొందాల్సి ఉండేది. కానీ ఇప్పుడున్న టెక్నాలజీ వల్ల బ్యాంకులు వీలైనంత తొందరలోనే రుణాలు మంజూరు చేస్తున్నాయి.

తక్కువ వడ్డీకే పర్సనల్ లోన్ మంజూరు చేస్తోంది ఎస్బీఐ. కేవలం 9.60 శాతం వడ్డీలకే పర్సనల్ లోన్ ఇస్తామని ప్రకటించించింది. కస్టమర్లకు రూ.20 లక్షల వరకు అందిస్తోంది. గతంలో వ్యక్తిగత రుణం పొందాలంటే 12 శాతం నుంచి 16 శాతం వరకు వడ్డీ ఉండేది. కానీ ఇటీవల వడ్డీ రేట్లను భారీగా తగ్గించింది ఎస్బీఐ.

గతంలో హోమ్ లోన్ వడ్డీ రేట్లతో సమానంగా ఇప్పుడు వ్యక్తిగత వడ్డీ రేట్లు ఉన్నాయి. 10 శాతంలోపే రుణం అందిస్తోంది. అయితే ఇవి ప్రీ అప్రూవ్డ్ లోన్స్. అంటే కస్టమర్ల క్రెడిట్ హిస్టరీ, క్రెడిట్ స్కోర్ లాంటివి పరిగణలోకి తీసుకొని తక్కువ వడ్డీకే రుణాలను ఇస్తుంటాయి బ్యాంకులు.

ముందుగా రుణాలు మంజూరు చేసి కస్టమర్లకు సమాచారం ఇస్తాయి. వీటినే ప్రీ అప్రూవ్డ్ లోన్స్ అంటారు. కస్టమర్లు తమకు అవసరమైతే ఈ రుణాలను సులువగా తీసుకునే అవకాశం ఉంటుంది.

ఎస్బీఐ కస్టమర్లు తమకు ప్రీ అప్రూవ్డ్ లోన్ మంజూరైందా..? లేదా అన్న విషయాన్ని ఓ ఎస్ఎంఎస్ ద్వారా తెలుసుకోవచ్చు. ఇందు కోసం కస్టమర్లు తమ రిజిస్టర్ మొబైల్ నెంబర్ నుంచి PAPL అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి అకౌంట్ నెంబర్లోని చివరి 4 అంకెలు టైప్ చేసి 567676 నెంబర్కు ఎస్ఎంఎస్ పంపాలి.

ఉదాహరణగా చెప్పాలంటే.. మీ అకౌంట్ నెంబర్ చివర్లో 7890 అని ఉంటే మీరు PAPL 7890 అని టైప్ చేసి 567676 నెంబర్కు ఎస్ఎంఎస్ చేయాలి. ప్రీ అప్రూవ్డ్ లోన్ వర్తిస్తుందో లేదో ఎస్ఎంఎస్ ద్వారా తెలిసిపోతుంది. అందరికీ రూ.20 లక్షల వరకు ప్రీ అప్రూవ్డ్ లోన్ రాకపోవచ్చు. అయితే వినియోగదారుడి క్రెడిట్ హిస్టరీ, తిరిగి చెల్లించే సామర్థ్యాన్ని బట్టి ఇది మారుతుంది.