
కావాల్సిన పదార్థాలు:అర కిలో ఇసుక దొందులు చేపలు, రెండు ఉల్లిపాయలు, రెండు టమోటాలు, నాలుగు పచ్చిమిర్చి, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక టేబుల్ స్పూన్ కారం , అర టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి, అర టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, అర టేబుల్ స్పూన్ గరం మసాలా, చింతపండు రసం , నూనె , కరివేపాకు, కొత్తిమీరను తీసుకోవాలి.

ముందుగా చేపలను తీసుకుని ఒకటికి రెండు సార్లు బాగా కడిగి, దానిలో ఉప్పు , పసుపు వేసి పది నిముషాల పాటు అలాగే ఉంచాలి. ఇప్పుడు పాన్ లో ఆయిల్ వేసి అది వేడయ్యాక కరివేపాకు, పచ్చిమిర్చి కూడా వేయండి.

ఇప్పుడు కట్ చేసిన ఉల్లిపాయలు వేసి బంగారు కలర్లోకి మారే వరకు బాగా వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వాసన పోయే వరకు వేయించాలి. ఇంకా టమోటాలు కూడా వేసి బాగా ఉడికించుకోవాలి.

ఒక టేబుల్ స్పూన్ కారం, అర టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి, అర టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసి కలపండి. ఆ తర్వాత చింతపండు రసం వేసి బాగా ఉడికించుకోవాలి.

గ్రేవీగా అయినా తర్వాత ఇసుక దొందులు చేపలు వేసి స్లోగా కలపాలి. ఆ తర్వాత మూత పెట్టి 10 నుంచి 15 నిమిషాల మధ్య సన్నని మంటపై ఉడికించండి. చివర్లో మసాలా పొడి , కొత్తిమీరను వేసి స్టవ్ మీద నుంచి కిందకు దించేయండి.