
అనారోగ్య సమస్యలకు బయట వాడే ముందుల కంటే నేచురల్ గా ఫుడ్స్ తో తగ్గించుకోవచ్చు. వీటి కోసం మీరు హాస్పిటల్స్ డబ్బులు పెట్టే బదులు మీ ఇంట్లో ఉండే వాటితోనే మీకు ఉన్న సమస్యలను తగ్గించుకోవచ్చు. సగ్గుబియ్యం, రాగి దోస తింటే 50 రోగాలు వదిలి పారిపోతాయి. దీనిని ఎలా చేయాలో ఇక్కడ చూద్దాం..

సగ్గుబియ్యం, రాగి దోస రెసిపీకి కావాల్సిన పదార్థాలు: ఒక కప్పు సగ్గుబియ్యం, ఒక కప్పు మినపప్పు , ఒక కప్పు అటుకులు, ఒక కప్పు – 1 కప్పు, ఒక కప్పు రాగులు , ఒక టేబుల్ స్పూన్ మెంతులు, రుచికి సరిపడా ఉప్పు, ఒక గ్లాస్ నీళ్లు తీసుకోవాలి. అయితే, మీరు వీటిని ముందుగా నానాబెట్టి దీనిని పట్టుకోవాలి.

సగ్గుబియ్యం, రాగి దోస రెసిపీ తయారీ విధానం:ముందుగా సగ్గుబియ్యం విడిగా నానా బెట్టుకోవాలి, అలాగే మినపప్పును కూడా ముందుగా నానా పెట్టాలి. ఇంకా అటుకులు, రాగులు, మెంతులను ఒక గిన్నెలో వేసుకోవాలి. దీనిలో కూడా సరిపోను నీళ్లు పోసి కనీసం 8 గంటల వీటిని నీళ్లలోనే ఉంచాలి అప్పుడే ఇది మంచి టేస్ట్ వస్తుంది.

సగ్గుబియ్యం, రాగి దోస రెసిపీ తయారీ విధానం: ఆ తర్వాత నానిన రాగులను , మినపపును తీసుకుని మిక్సీలో వేసి మెత్తగా పిండిలా పట్టుకోవాలి. అయితే, వెంటనే దీనిని అట్టులాగా వేసుకోకుండా ఈ పిండిని 7 గంటలు కదిలించకుండా పులియబెట్టాలి.ఇలా చేస్తే మంచి రుచి వస్తుంది.

సగ్గుబియ్యం, రాగి దోస రెసిపీ తయారీ విధానం స్టెప్ 2: పులియబెట్టిన ఈ పిండిని తీసుకుని దీనిలో ఉప్పు వేసి, అవసరమైతే ఇంకా దీనిలో కొద్దిగా నీళ్లు కలిపి దోస పిండిలాగా కలుపుకోవాలి. వేడి పెనంను పొయ్యి మీద పెట్టి నూనె వేసి దోస లాగా పోసి ఒక వైపు కాలిన తరవాత రెండో వైపు కూడా బాగా కాల్చుకుంటే సగ్గుబియ్యం–రాగి దోస రెడీ