PV Sindhu: దుర్గమ్మ దయతోనే ఒలింపిక్స్‌లో గెలుపొందా .. నెక్స్ట్ ఒలింపిక్స్‌లో గోల్డ్ సాధిస్తా: పీవీ సింధు

|

Aug 06, 2021 | 11:39 AM

PV Sindhu: టోక్యో ఒలింపిక్స్ లో కాంస్య పతకం అందుకుని చరిత్ర సృష్టించి స్వదేశానికి వచ్చిన పీవీ సింధుకి అడగడుగునా బ్రహ్మరథం పడుతున్నారు. తాజాగా సింధు విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకుంది. ఆలయాధికారులు సింధుకి ఘన స్వగతం పలికారు.

1 / 5
టోక్యో ఒలింపిక్‌ లో కాంస్య పతక విజేత పీవీ సింధు విజయవాడ కనక దుర్గమ్మను దర్శించుకుంది. ఈ సందర్భంగా సింధుకి పూర్ణకుంభంతో ఆలయ అధికారులు స్వాగతం పలికారు.

టోక్యో ఒలింపిక్‌ లో కాంస్య పతక విజేత పీవీ సింధు విజయవాడ కనక దుర్గమ్మను దర్శించుకుంది. ఈ సందర్భంగా సింధుకి పూర్ణకుంభంతో ఆలయ అధికారులు స్వాగతం పలికారు.

2 / 5
 సింధు కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారికి ప్రత్యేక పూజలను నిర్వహించారు. అనంతరం పండితులు సింధుకు వేదాశీర్వచనం అందించారు.

సింధు కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారికి ప్రత్యేక పూజలను నిర్వహించారు. అనంతరం పండితులు సింధుకు వేదాశీర్వచనం అందించారు.

3 / 5
ఈ సందర్భంగా సింధుకి కనక దుర్గ అమ్మవారి ఆలయ అధికారులు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలను అందజేశారు.

ఈ సందర్భంగా సింధుకి కనక దుర్గ అమ్మవారి ఆలయ అధికారులు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలను అందజేశారు.

4 / 5
ఈ సందర్భంగా సింధు మాట్లాడుతూ.. ఒలింపిక్స్‌కు వెళ్లేముందు దుర్గమ్మను దర్శించుకున్నానని.. అమ్మవారి ఆశీస్సులతో పతకం గెలిచానని చెప్పారు. దుర్గమ్మ దర్శనానికి రావడం సంతోషంగా ఉందని చెప్పారు.

ఈ సందర్భంగా సింధు మాట్లాడుతూ.. ఒలింపిక్స్‌కు వెళ్లేముందు దుర్గమ్మను దర్శించుకున్నానని.. అమ్మవారి ఆశీస్సులతో పతకం గెలిచానని చెప్పారు. దుర్గమ్మ దర్శనానికి రావడం సంతోషంగా ఉందని చెప్పారు.

5 / 5
2024 ఒలింపిక్స్‌  లో పాల్గొంటానని ఈసారి ఖచ్చితంగా స్వర్ణం సాధిస్తానని సింధు చెప్పారు. భవిష్యత్తులో మరిన్ని టోర్నమెంట్లు ఆడాల్సి ఉందన్నారు.

2024 ఒలింపిక్స్‌ లో పాల్గొంటానని ఈసారి ఖచ్చితంగా స్వర్ణం సాధిస్తానని సింధు చెప్పారు. భవిష్యత్తులో మరిన్ని టోర్నమెంట్లు ఆడాల్సి ఉందన్నారు.