భారతీయ సంప్రదాయం మరియు అతిపెద్ద వ్యవస్థ మరియు దాని భవనాల గురించి ప్రపంచానికి తెలియజేయడానికి సూరత్ ఆభరణాల పరిశ్రమకు సంబంధించిన వ్యాపారులు కొత్త పార్లమెంటు భవనం ఆకారంలో హిప్ హాప్ ఆభరణాలను సృష్టించారు. సూరత్ మరియు ఆభరణాల పరిశ్రమకు సంబంధించిన వ్యాపారులు ప్రస్తుతం ఈ డిజైన్ యొక్క ఆభరణాలను తయారు చేస్తున్నారు. దేశ విదేశాల్లో కూడా ఈ ఆభరణాలకు డిమాండ్ కనిపిస్తోంది. ఇది వజ్రాభరణం. కలర్ స్టోన్, మీనాకారి, ఈ ఆభరణాల లోపల తయారు చేయబడింది.
సూరత్కు చెందిన ప్రముఖ ఆభరణాల తయారీ సంస్థ సోనియో.. కొత్త పార్లమెంట్ భవన ఆకృతిలో బంగారు చెవి రింగులు, ఉంగరాలను తయారు చేసి విక్రయిస్తోంది. చెవి రింగుల బరువు 2 గ్రాముల నుంచి ప్రారంభమవుతాయి.
వీటితో పాటు ప్రధాని మోదీ ఫొటోతో డైమండ్ లాకెట్ను తయారు చేసి అమ్ముతోంది. అలాగే వెండితో పార్లమెంట్ నమూనాను రూపొందించింది. వీటి గురించి తెలుసుకున్న సూరత్ ప్రజలు.. ఈ వినూత్న ఆభరణాలను చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.
కొత్త పార్లమెంట్ ఆకృతిలో తయారు చేసిన బంగారు చెవి రింగులు, ఉంగరాలకు విలువైన వజ్రాలను కూడా పొదిగింది సోనియో కంపెనీ. మోదీ డైమండ్ లాకెట్పై ప్రధాని చిత్రాన్ని 3డీ ప్రింట్ను ఉపయోగించి ముద్రించింది. దీనిపై 'ది లెజెండ్' అని చెక్కింది. రెండున్నర అంగుళాల పొడవు ఉన్న ఆ లాకెట్కు బాగా డిమాండ్ ఉందని చెబుతోంది.
ఇటీవలే ప్రధాని మోదీ.. కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించారు. అందుకే పార్లమెంట్ నమూనాను రూపొందించాలనే ఆలోచన తమకు వచ్చిందని సూరత్కు చెందిన మరో ప్రముఖ వ్యాపారవేత్త రోహన్ షా తెలిపారు. దేశీయ మార్కెట్తో పాటు అంతర్జాతీయ మార్కెట్లోనూ దీన్ని ప్రదర్శించబోతున్నాం. మోదీ డైమండ్ లాకెట్కు చాలా డిమాండ్ ఉంది అంటూ రోహన్ చెప్పుకొచ్చారు.