
శ్రీశైలానికి ఎడమ వైపు తెలంగాణ... కుడి వైపు రాయలసీమ. రెండు వైపులా ఈ కృష్ణా నీళ్లే కీలకం. రెండు ప్రాంతాలకు తాగు, సాగునీటికి శ్రీశైలమే ఆధారం. వరదలు వచ్చినప్పుడు ఏ సమస్యా ఉండదు. ఎవరికి ఎంత కావాలన్నా వాడుకోవచ్చు. నీటి ప్రవాహలు తగ్గినప్పుడే అసలు సమస్య. అదే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల మధ్య అగ్గి రాజేస్తోంది.

ఉమ్మడి మహబూబ్నగర్, కర్నూలు జిల్లా సరిహద్దుల్లో ఉన్న RDS కుడి కాలువ పనులతో రెండు రాష్ట్రాల మధ్య మళ్లీ నీళ్లు అగ్గి రాజేశాయి. ఏపీ పనులు ప్రారంభించడంతో అగ్గి మీద గుగ్గిలం అవుతోంది తెలంగాణ. ఈ నేపథ్యంలో మంత్రి ప్రశాంత్రెడ్డి మహబూబ్నగర్లో చేసిన వ్యాఖ్యలు రెండు రాష్ట్రాల నేతల మధ్య డైలాగ్ వార్కు దారితీశాయి.

లంకలో ఉన్నోళ్లంతా రాక్షసులే, ఆంధ్రోళ్లంతా తెలంగాణ వ్యతిరేకులేనని నిన్న కామెంట్ చేశారు ప్రశాంత్రెడ్డి. నీళ్ల కోసం యుద్ధం తప్పదని హెచ్చరించారు. వైఎస్ నీళ్ల దొంగ అని, జగన్ గజదొంగ అని కామెంట్ చేశారు.

Somu Veerraju

AP Minister Anil Kumar Yadav

నీళ్ల కోసం యుద్ధాలు జరుగుతాయని గతంలో తాము చెప్పిందే ఇప్పుడు నిజమవుతోందని టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. ఏపీ ప్రభుత్వ తప్పుడు నిర్ణయాలతో భవిష్యత్ తరాలు ఇబ్బందులు పడే పరిస్థితులు వచ్చాయన్నారు.

Gangula Kamalakar

తాజా వివాదంతో వ్యవహారం ఢిల్లీ వరకు వెళ్లింది. సుప్రీంకోర్టుకు వెళ్లే ప్రయత్నం చేస్తోంది ఏపీ ప్రభుత్వం. ఇప్పటికే కృష్ణా బోర్డుకు మరోసారి ఫిర్యాదు చేసింది తెలంగాణ సర్కార్. వెంటనే ఏపీ ప్రాజెక్ట్లపై పరిశీలన చేయాలని డిమాండ్ చేస్తోంది.