మౌంట్ అబూ: రాజస్థాన్లోని మౌంట్ అబూ పర్యాటకులకు ఎంతో ఆకర్షణీయమైన ప్రదేశం. హనీమూన్ డెస్టినేషన్గా కూడా ప్రసిద్ధి చెందిన ఈ ప్రదేశం చాలా అందంగా ఉంటుంది. ఇక వర్షాకాలంలో అయితే ఈ ప్రదేశం మరింత అందంగా కనిపిస్తుంది.
భాన్గర్ కోట: చిన్న చిన్న కొండల మధ్యలో ఉన్న భాన్గర్ కోట వర్షాల కారణంగా పచ్చదనంతో చుట్టుముడుతుంది. దెయ్యాల కోటగా పిలువబడే ఈ కోట అందం చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. అందుకే ఈ ప్రదేశాన్ని సందర్శించేందుకు పర్యాటకులు ఆసక్తి చూపిస్తుంటారు.
ఉదయపూర్: అనేక చారిత్రక కట్టడాలకు నిలయమైన ఉదయపూర్ రాజవంశాల చరిత్రకే కాక పచ్చదనానికి కూడా పేరుగాంచింది. ఉదయపూర్లో అనేక అందమై కొండలు ఉన్నాయి. ఇక వర్షాకాలంలో వాటి అందం రెట్టింపు అవుతుంది.
జైపూర్: రాజస్థాన్ పర్యటన గురించి మాట్లాడితే, జైపూర్ నగరాన్ని ఎలా మరచిపోగలరు. పింక్ సిటీగా ప్రసిద్ధి చెందిన జైపూర్లోని అమెర్ కోటతో సహా అనేక చారిత్రక ప్రదేశాలు ఉన్నాయి. వర్షాకాలంలో ఈ ప్రదేశాల అందాలను వీక్షించేందుకు పర్యాటకులు ఇష్టపడతారు.
సజ్జన్గఢ్ ప్యాలెస్: రాజస్థాన్లోని మరో పర్యాటక ప్రదేశం సజ్జన్గఢ్ ప్యాలెస్. అనేక సరస్సులతో బోటింగ్కి అనుకూలంగా ఉండే ఈ ప్రదేశం పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తుంది. ముఖ్యంగా సూర్యాస్తమయ సమయంలో ఈ ప్రదేశం చాలా అద్భుతంగా ఉంటుంది.