ఉరుకులు పరుగుల జీవితం.. పని ఒత్తిడి, కుటుంబ సమస్యలు.. ఇలా అనేక కారణాల వల్ల చాలామంది అనారోగ్యం బారిన పడుతున్నారు.. అయితే.. కరోనా నాటి నుంచి ఊబకాయం సమస్య చాలా మందిని వెంటాడుతోంది.. ముఖ్యంగా బీపీ, గుండె పోటు సహా పలు ప్రమాదకర సమస్యలకు స్థూలకాయం కారణమవుతోందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. శరీరంలో ఊబకాయం పెరిగినప్పుడు ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవాలి. శరీరంలో కొవ్వు పెరగడానికి అనేక కారణాలు ఉండవచ్చు.. సరికాని ఆహారం, ఒత్తిడి, హార్మోన్ల అసమతుల్యత, నిద్ర లేకపోవడం, ఇన్సులిన్ నిరోధకత ఇలా.. అనేక ఇతర కారణాల వల్ల శరీరంలో కొవ్వు పేరుకుపోవడం ప్రారంభమవుతుంది.