
కావాల్సిన పదార్థాలు: ఒక కప్పు పెసరపప్పు , కొద్దిగా చింతపండు, పచ్చిమిర్చి , ఒక పెద్ద ఉల్లిపాయ , నాలుగు టమాటా - పోపు దినుసులు, అర టీ స్పూన్ ఆవాలు, అర టీ స్పూన్ జీలకర్ర, అర టీ స్పూన్ మినపప్పు, రెండు ఎండుమిర్చి, కరివేపాకు, ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ కారం, అర టీ స్పూన్ పసుపు, కొత్తిమీరను తీసుకోవాలి.

పెసరపప్పు చారు ఎలా తయారు చేయాలంటే? ముందుగా ఒక కప్పు పెసరపప్పును తీసుకుని కడిగి కుక్కర్లో వేసి దానిలో రెండు గ్లాస్ ల నీళ్లు పోసి మెత్తగా ఉడికించి పక్కన పెట్టుకోవాలి.

ఇక ఇప్పుడు ఉడుకుతున్న పప్పులో కొద్దిగా చింతపండు రసం, నాలుగు పచ్చిమిర్చి, కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు , అర టీ స్పూన్ పసుపు, ఒక టేబుల్ స్పూన్ కారం, రుచికి తగినంత ఉప్పు వేసి బాగా ఉడకనివ్వాలి.

ఉడికిన పప్పును కిందకు దించి పప్పు గుత్తితో మెత్తగా మెదిపి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత పాన్ తీసుకుని రెండు టేబుల్ స్పూన్స్ నూనె లేదా నెయ్యి చేసి, పోపు, నాలుగు కరివేపాకు ఆకులు, కొద్దిగా ఇంగువ వేసి బాగా వేయించుకోవాలి.

ఇక చివర్లో మంచి రుచి కోసం దించే ముందు అర కట్ట కొత్తిమీరను తీసుకుని కట్ చేసి పప్పు చారులో చల్లుకుని స్టవ్ ఆపేసి వడ్డించుకుని తినడమే. అంతే, వేడి వేడి పెసర పప్పు చారు రెడీ.