
సమ్మర్లో మామిడి పండ్లను ఎక్కువ తింటారు. అయితే, కొందరికి ఇవి పడవు వాటి వలన అనారోగ్య సమస్యలు ఎక్కువవుతాయి. మరి, ఎలాంటి సమస్యలు ఉన్నవారు తినకూడదో ఇక్కడ చూద్దాం..

జీర్ణ సంబంధిత సమస్యలతో బాధ పడేవారు మామిడి పండ్లను ఎంత తక్కువ తీసుకుంటే అంత మంచిది. వీటిని తినడం వల్ల కడుపులో అజీర్తి, మల బద్ధకం లాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

మామిడి పండ్లు సహజంగానే తియ్యగా ఉంటాయి.ఎందుకంటే దీనిలో షుగర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. అలాగే, దీనిలో క్యాలరీలు కూడా ఉంటాయి. వీటిని అదే పనిగా తింటే బరువు అమాంతం పెరుగుతారు.

అమ్మాయిల్లో కొందరికి మామిడి పండ్లు తిన్న వెంటనే మొటిమలు, నల్లని మచ్చలు వస్తాయి. ఇలాంటి వాళ్ళు మామిడి పండ్లకు ఎంత దూరం ఉంటే అంత మంచిది. అలాగే, అలర్జీలు కూడా వచ్చే ఛాన్స్ ఉంది.

డయాబెటిస్ ఉన్న వారు మామిడి పండ్లను తినకపోవడమే మంచిది లేదంటే షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి. అలాగే, మధుమేహంతో ఇబ్బంది పడేవారు కూడా వీటికి ఎంత దూరం ఉంటే అంత మంచిది.