
కావాల్సిన పదార్దాలు: ఒక కప్పు పచ్చి మామిడికాయ తురుము, మూడు టేబుల్ స్పూన్స్ కారం, ఒక టేబుల్ స్పూన్ మెంతులు, ఒక టేబుల్ స్పూన్ నువ్వుల నూనె, అర టీ స్పూన్ ఆవాలు, 5 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా అల్లం, ఒక కప్పు కరివేపాకు లు, రుచికి సరిపడా ఉప్పును తీసుకోవాలి.

ముందుగా గ్యాస్ ఆన్ చేసి దాని మీద పాన్ పెట్టుకుని మెంతులను దోరగా వేయించి చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకుని మెత్తగా పొడిలా పట్టుకోవాలి. ఇప్పుడు పచ్చి మామిడికాయ తీసుకుని కడిగి పక్కన పెట్టుకోవాలి.

ముందుగా పచ్చి మామిడికాయను తీసుకుని తురుము లాగా చేసుకోవాలి. ఆ తర్వాత దీనిలో ఒక టేబుల్ స్పూన్ కారం, కొద్దిగా పసుపు, మెంతి పొడి వేసి మిక్స్ అయ్యేలా బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత దీనిని 20 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి.

ఆ తర్వాత తాలింపు పెట్టుకోవాలి. ఇంకా స్టవ్ మీద నువ్వుల నూనెను పెట్టి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ఆవాలు వేసుకోవాలి. అవి వేగుతున్నప్పుడు దానిలో వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించండి. కొద్దీ సేపటి తర్వాత కొద్దిగా అల్లం, కరివేపాకు వేసి కలుపుకోవాలి.

ఈ పోపు చల్లారిన తరువాత దానిలో ఉప్పు వేసి, మామిడి తురుమును కూడా వేసి బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. అంతే, ఆంధ్రా స్టైల్ మామిడికాయ తురుము పచ్చడి రెడీ. దీనిని వేడి వేడి అన్నంలో తింటే టేస్ట్ అదిరిపోతోంది.