ఎవ్వరైనా తప్పు చేస్తే.. ఆ విషయం బయటికి తెలియకుండా ఉండేందుకు అబద్దం ఆడుతుంటారు. లేదంటే ఏమి తెలియనట్లు అమాయకులుగా నటిస్తుంటారు. అయితే ఇక్కడొక యువతి మాత్రం తాను చేసిన తప్పు బయటికి తెలిసిపోతుందేమోనని భయపడి ఎంతకు తెగించిందో తెలుసా.? అసలు ఆమె ఏం చేసిందో తెలుసుకుంటే మీ ఫ్యూజులు ఎగిరిపోవడం ఖాయం. మరి ఆ స్టోరీ ఏంటో తెలుసుకుందాం పదండి..!
అసలు విషయానికొస్తే.. జో బెర్నాడ్ అనే మహిళ 2019వ సంవత్సరంలో మద్యం సేవించి వాహనాన్ని నడుపుతూ ట్రాఫిక్ పోలీసులకు చిక్కింది. ఆ సమయంలో ఆమె డ్రైవింగ్ లైసెన్స్పై సుమారు 18 నెలల పాటు నిషేధం పడింది. అయితే అదేం పట్టించుకోకుండా.. ఈమె మళ్లీ డ్రైవింగ్ చేస్తూనే ఉంది. ఇక 2020లో ఆమె మరోసారి ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించి పోలీసులకు దొరికింది.
సదరు ఇన్సిడెంట్ గురించి ఆమెను విచారించేందుకు పోలీసులు జో ఇంటికి వెళ్లగా.. జో బెర్నార్డ్ తన చెల్లి అని.. ఆమెకు జబ్బు చేసి కొద్దిరోజులు క్రితం మృతి చెందిందని చెప్పింది. పోలీసులు అది నమ్మి అక్కడ నుంచి వెళ్ళిపోయారు.
మరి పోలీసులకు జో బెర్నార్డ్ చేస్తోన్న డ్రామా ఎప్పుడు తెలిసిందనేగా మీ ప్రశ్న. సుమారు నెల రోజుల పాటు అందరికి తాను చనిపోయానని నమ్మించిన జో బెర్నార్డ్.. అందుకు అనుగుణంగా ఓ ఫేక్ డెత్ సర్టిఫికేట్ను సైతం సృష్టించింది. ఇక అదే ఆమెకు శాపమైంది. కోర్టుకు సబ్మిట్ చేయడంలో అది ఫేక్ అని తేలడంతో అసలు నిజం బయటపడింది.
చేసిన తప్పుకు కోర్టు జో బెర్నార్డ్ను మందలించడంతో పాటు 8 నెలల శిక్ష కూడా విధించింది. కాగా, జో బెర్నార్డ్ 2019లో ఒకసారి డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడి జైలుకి వెళ్లగా.. 2020లో అదే తప్పును రిపీట్ చేసి అడ్డంగా దొరికింది.