బంగారు రాజదండంను ఆభరణాలు పొదిగించబడిందని, అప్పటి విలువ రూ.15,000 అని, చెన్నైకి చెందిన వుమ్మిడి బంగారు చెట్టి అండ్ సన్స్ పేర్కొంది. వుమ్మిడి బంగారు చెట్టి కుటుంబం తామే సెంగోల్ను తయారు చేసినట్లు ధృవీకరించారు. దీన్ని తయారు చేసిన కుటుంబంలోని పెద్ద 95 ఏళ్లు పైబడినప్పటికీ, వివరాలను గుర్తుకు తెచ్చుకోలేకపోయారు. అయితే, ఈ వేడుక ఫోటో వారి ఇంట్లో ఉన్నట్లు వర్గాలు తెలిపాయి.