మన శరీరంలో గుండె, కాలేయం మాదిరిగానే అతి ముఖ్యమైన అవయవాలలో కిడ్నీ ఒకటి. శరీర వ్యర్థాలు ఈ మూత్రపిండాల ద్వారా ఫిల్టర్ అవుతాయి. కిడ్నీలు ఆరోగ్యంగా లేకపోతే శరీరం మొత్తం ఆరోగ్యం చెడిపోతుంది. క్రమబద్ధమైన జీవనశైలి, తప్పుడు ఆహారం కారణంగా కిడ్నీలు దెబ్బతింటాయి. నేటి కాలంలో చాలా మంది కిడ్నీ స్టోన్ సమస్యలతో కూడా బాధపడుతున్నారు. అలాంటప్పుడు ఆహారం విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి
కిడ్నీలో రాళ్లను శస్త్రచికిత్స లేకుండానే తొలగించవచ్చు. అందుకు ప్రత్యేక ఆహారం అలవాట్లు పాటించాలి. అందులో ఒకటి అదనంగా నీరు అధికంగా తాగడం
శరీరంలో కాల్షియం స్థాయి తగ్గితే కిడ్నీలో రాళ్లు పేరుకుపోతాయి. కాబట్టి కాల్షియం అధికంగా ఉండే ఆహారాన్ని ఎక్కువగా తినాలి. అందుకు రోజువారీ ఆహారంలో పాలు, పెరుగు, నెయ్యి మొదలైన పాల ఉత్పత్తులను చేర్చుకోవాలి.
విటమిన్-డి శరీరం కాల్షియంను గ్రహించడంలో సహాయపడుతుంది. కాబట్టి పుట్టగొడుగులు, చీజ్, ఫ్యాటీ ఫిష్, సాల్మన్ వంటి విటమిన్-డి రిచ్ ఫుడ్స్ ఎక్కువగా తినాలి. కిడ్నీలో రాళ్లను కరిగించడంలో సిట్రస్ పండ్లు ఎంతో సహకరిస్తాయి. నిమ్మకాయలను సిట్రస్ పండ్లు అంటారు. కాబట్టి ప్రతిరోజూ కనీసం ఏదోఒక నిమ్మజాతిపండు తినాలి.
కిడ్నీలో రాళ్లు ఉంటే, గుడ్లు, చేపలు, మాంసం వంటి జంతు ప్రోటీన్లను తక్కువగా తినాలి. బదులుగా, రోజువారీ ఆహారంలో డాలియా, ఓట్స్, క్వినోవా వంటి తృణధాన్యాలు తినాలి. ఇలాంటి మొక్కల ప్రోటీన్లు కిడ్నీ ఆరోగ్యానికి మేలు చేస్తుంది.