కిడ్నీ స్టోన్స్ వల్ల పొత్తి కడుపులో, పక్కటెముకలకి రెండు వైపులా తీవ్రమైన నొప్పి తలెత్తుతుంది. మూత్రం పసుపు రంగులో రావడంతో పాటు, మూత్రంలో దుర్వాసన, రక్తస్రావం, మూత్రవిసర్జన సమయంలో మంట పెరుగుతుంది. రోజుకు 3 లీటర్ల కంటే తక్కువ నీరు తాగడం వల్ల కిడ్నీ సమస్యలు వస్తాయి. కేవలం నీళ్లు తాగడమే కాదు కిడ్నీలో రాళ్లు రాకుండా ఉండాలంటే ఈ 5 రకాల ఆహారానికి దూరంగా ఉండాలి.
ఆక్సలేట్స్ ఉన్న ఆహారాన్ని ఎక్కువగా తినకూడదు. పాలకూర, బీట్రూట్, బంగాళదుంపలు, పప్పులు, చాక్లెట్లు, వేరుశెనగ వంటి ఆహారాలను ఎక్కువగా తినవద్దు.
ఆహారంలో ఉప్పు మొత్తాన్ని తగ్గించాలి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం రోజుకు 5 గ్రాముల కంటే ఎక్కువ ఉప్పు తినకూడదు. ఉప్పు ఎక్కువగా తినడం వల్ల కిడ్నీలతోపాటు శరీరంలో ఇతర అవయవాలు దెబ్బతింటాయి.
కిడ్నీ సమస్యలకు జంతు ప్రోటీన్ను నివారించడం మంచిది. జంతు మాంసకృత్తులు ఎక్కువగా తినడం వల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడే ప్రమాదం ఉంది. మంచి ఆరోగ్యానికి విటమిన్ సి అవసరం. కానీ విటమిన్ సి ఎక్కువగా పెరిగితే కిడ్నీలో రాళ్లు ఏర్పడే ప్రమాదం ఉంది. కూరగాయలు, పండ్ల ద్వారా శరీరంలో విటమిన్ సి లోపాన్ని నివారించవచ్చు.
ప్రాసెస్ చేసిన ఆహారాన్ని ఎక్కువగా తినడం వల్ల కిడ్నీలు దెబ్బతింటాయి. కిడ్నీలో రాళ్లు ఏర్పడవచ్చు. ఫాస్ట్ ఫుడ్ తినడం మానేసి ఇంట్లో వండిన ఆహారాన్ని తినడం మంచిది. మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి రోజుకు 4 లీటర్ల నీరు తప్పక తాగాలి.