
పర్పుల్ క్యాప్ రేసులో గుజరాత్ టైటాన్స్ కు చెందిన లూకీ ఫెర్గూసన్ 5వ స్థానంలోకి దూసుకొచ్చాడు. ఐపీఎల్-15లో 5 మ్యాచ్లు ఆడిన గుజరాత్కు చెందిన లూకీ మొత్తం 6 వికెట్లు పడగొట్టాడు..

এరాజస్థాన్కు చెందిన యుజువేంద్ర చాహల్ ప్రస్తుతం పర్పుల్ క్యాప్ రేసులో అగ్రస్థానంలో ఉన్నాడు. ఐపీఎల్-15లో మొత్తం 5 మ్యాచ్లు ఆడిన యూజీ 12 వికెట్లు పడగొట్టాడు.

కోల్ కతా నైట్ రైడర్స్ ఉమేష్ యాదవ్ ఈ జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు. అతను ఐదు మ్యాచ్ల్లో 10 వికెట్లు తీశాడు. కాగా కేకేఆర్ ఈరోజు హైదరాబాద్తో తలపడనుంది. దీంతొ ఉమేశ్ చాహల్ను అధిగమించి మళ్లీ మొదటి స్థానంలోకి వచ్చే అవకాశముంది

పర్పుల్ క్యాప్ రేసులో ఢిల్లీ క్యాపిటల్స్కు చెందిన కుల్దీప్ యాదవ్ మూడో స్థానంలో ఉన్నాడు. ఇప్పటి వరకు కుల్దీప్ 4 ఐపీఎల్ మ్యాచ్ల్లో 10 వికెట్లు పడగొట్టాడు.

ఇక ఈ జాబితాలో బెంగళూరుకు చెందిన వనిందు హసరంగ నాలుగో స్థానంలో ఉన్నాడు. అతను ఇప్పటి వరకు 5 మ్యాచ్ల్లో 10 వికెట్లు తీశాడు.

గుజరాత్ టైటాన్స్ ఆటగాడు లూకీ ఫెర్గూసన్ ఈ సీజన్లో అద్భుతంగా రాణిస్తున్నాడు.