
నెల్లూరు కేంద్ర కారాగారంలో అంతర్జాతీయ యోగా డే వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన గుంటూరు రేంజ్ జైళ్ళ ఉపశాఖాధికారి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ వేడుకల్లో సుమారు 150 మంది, 400 మంది శిక్ష ఖైదీలు, 500 మంది రిమాండ్ ఖైదీలు, 18 మంది మహిళా ముద్దాయిలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయుష్ శాఖకు యోగా నిపుణులు పెంచలయ్య ఖదీలకు యోగా ప్రాముఖ్యతను వివరించి.. వారితో యోగాసనాలు వేయించారు. యోగ సాధన శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు మానసిక ప్రశాంతతను, ఏకాగ్రతను పెంపొందించడంలో ముఖ్య పాత్ర పోషిస్తుందని తెలిపారు.

అనంతరం గుంటూరు రేంజ్ జైళ్ళ ఉపశాఖాధికారి Dr. యం.వరప్రసాద్ మాట్లాడుతూ.. యోగా భారతదేశం ప్రపంచానికి అందించిన అమూల్యమైన వరమని పేర్కొన్నారు. యోగా ఉపయోగం, విశిష్టత, ప్రతిరోజూ అలవరచుకోవటం వలన ఆరోగ్యం మెరుగుపరుచుకోవచ్చన్నారు. కష్ట పడే తత్వం, ఏకాగ్రత, మనోధైర్యం, మరియు పట్టుదల ఆత్మవిశ్వాసం, భావోద్వేగ సమతుల్యతను పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తుందన్నారు. యోగా అలవాటు గా మారి ప్రతి పనిని శ్రద్దతో చేయటం వలన వారు చేసే ప్రతి పనిలో విజయం సాధిస్తారని.. దాని వలన ఆనందకరమైన జీవితాన్ని అలవరుచుకోవచ్చన్నారు. ఈ అలవాటు వృద్యాప్యంలో కూడా ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు.

తర్వాత అయుష్ శాఖ వారితో మూడు మాసాల ట్రైనింగ్ కోర్స్ ఏర్పాటు చేసి ఖైదీలకు శిక్షణ ఇచ్చి వీరి ద్వారా రాష్ట్రంలో ఉన్న జిల్లా జైళ్ళ లోని ఖైదీలకు యోగా నేర్పవచ్చని ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో యోగాను భాగంగా చేసుకొని ఆరోగ్యవంతమైన జీవనాన్ని గడపాలని సూచించారు. ముఖ్యంగా ఖైదీలలో సానుకూల దృక్పథం, మానసిక స్థైర్యం, క్రమశిక్షణ పెంపొందించడంలో యోగా ఎంతో ఉపయోగపడుతుందన్నారు.

తర్వాత Dr. వి. సన్యాసిరావు మాట్లాడుతూ.. యోగా విశిష్టత, ఉపయోగాలను వివరించారు. ఖైదీల మానసిక ఒత్తిడిని తగ్గించడంలో తాము యోగాను ఓ సాధనంగా ఉపయోగించామని, కాని ఇప్పటి నుండి పరిపూర్ణంగా వ్రుద్ది చెందడానికి సాదనంగా వాడుతామన్నారు. డైలీ యోగా చేయడం ద్వారా శరీరం, మనస్సులో కలిగే సానుకూల మార్పులను వివరించారు.