
కావాల్సిన పదార్థాలు : 300 గ్రాములు ఎండు చేపలు, 3 ఉడకపెట్టిన గుడ్లు, ఒక పెద్ద ఉల్లిపాయలు, 6 టేబుల్ స్పూన్స్ నూనె, పోపు, 5 పచ్చిమిర్చి, రెండు టేబుల్ స్పూన్స్ కారం, అర టీ స్పూన్ పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి సరిపడినంత ఉప్పును తీసుకోవాలి.

ముందుగా ఎండు చేపలను తీసుకుని వాటిని ముక్కలుగా చేసుకుని ఉప్పు, వేడి నీళ్ళతో కడిగి శుభ్రపరచుకోవాలి. 10 5 నిమిషాల పాటు ఒక గిన్నెలో వేసి పక్కన పెట్టుకోండి.

స్టవ్ వెలిగించి దానిలో ఆయిల్ వేసి అది వేడయ్యాక పోపు గింజలు, టమోటో, ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు వేసుకుని రంగు మారే వరకు వేయించాలి.

ఇప్పుడు ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అర టీ స్పూన్ పసుపు, కారం, ఉప్పు, ఒక కప్పు చింతపండు రసం, ఒక గ్లాస్ నీళ్లు పోసి 10 నిముషాల పాటు స్టవ్ మీదే ఉంచండి.

ఇప్పుడు ఈ మిశ్రమంలో ఉడకపెట్టిన కోడిగుడ్లు వేసి నూనె పైకి తేలే వరకు మీడియం మంటపై 15 నిముషాలు ఉంచి బాగా ఉడికించాలి. దించే ముందు కొత్తిమీర వేసి టేస్ట్ చూసి తక్కువైతే మళ్ళీ వాటిని కలుపుకొని దించేయండి. అంతే, వేడి వేడి కోడిగుడ్డు ఎండు చేపల పులుసు రెడీ .