
కావలసిన పదార్థాలు: ఒక కప్పు నాన బెట్టిన బియ్యం, 3 పెద్ద టొమాటోలు, 4 ఎండుమిర్చి , అల్లం , ఒక పెద్ద ఉల్లిపాయ, కొత్తిమీర , అర టీ స్పూన్ జీలకర్ర, రుచికి తగినంత ఉప్పు, మూడు టేబుల్ స్పూన్స్ నూనె.

ముందుగా నానబెట్టిన బియ్యం, కట్ చేసిన టొమాటోలు, 4 ఎండుమిర్చి, చిన్న అల్లం, అర టీ స్పూన్ జీలకర్రను వేసి రోట్లో కానీ మిక్సీ లో కానీ వేసి రుబ్బుకోవాలి. అయితే, దీనిలో ఒక గ్లాస్ నీళ్ళు పోసి పిండి లాగా రుబ్బుకోవాలి.

ఇక ఇప్పుడు ఈ పిండిని ఒక బౌల్ లోకి తీసుకుని, రుచికి సరిపడా ఉప్పు, దానిలో కొద్దిగా కొత్తిమీర, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి.

స్టవ్ వెలిగించి దాని మీద పెనం పెట్టి అది వేడయ్యాక ఒక స్పూన్ ఆయిల్ వేసి చిన్న గరిటెను తీసుకుని పిండిని పోసి దోస లాగా పోయాలి.

దోసె ఒక వైపు కాలిన తర్వాత చుట్టూ, రెండో వైపు కూడా తిప్పుతూ రెండు వైపులా బాగా కాలనిచ్చి ఒక ప్లేట్ లోకి తీసుకోండి. చట్నీతో తింటే ఇలాంటి టేస్ట్ మరెక్కడా ఉండదు.