
కావాల్సిన పదార్ధాలు: అర కిలో చేప జన, 2 పెద్ద ఉల్లిపాయలు, 4 పచ్చిమిర్చి, ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒకటిన్నర టీ స్పూన్ కారం, అర టీ స్పూన్ పసుపు, ఉప్పు , కరివేపాకు, 4 టేబుల్ స్పూన్స్ నూనె, నిమ్మరసం తీసుకోవాలి.

ముందుగా చేప జనను తీసుకుని నీటిలో బాగా శుభ్రపరచుకోవాలి. ఇక ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టి వెలిగించి ఆయిల్ వేసి నూనె దానిలో ఉల్లిపాయలు ముక్కలు పచ్చిమిర్చి, కరివేపాకు వేసి రంగు మారే బాగా వేయించాలి.

ఇక ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి బాగా వేయించాలి. ముందుగా పక్కన పెట్టుకున్న చేప జనను దానిలో వేసి బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి.

ఇప్పుడు గరిటేతో జనను తిప్పుతూ ఉండండి. మూత పెట్టి మీడియం మంటపై పది నిమిషాల పాటు బాగా ఉడికించాలి. ఒక టేబుల్ స్పూన్ కారం వేసి కొద్దిగా ఉప్పు వేసి కలుపుకోవాలి.

జన ఫ్రై గా మారి అయ్యి మంచి రంగు వచ్చే వరకు వేయించాలి చివర్లో కొత్తిమీర, నిమ్మరసం వేసి చల్లి కిందకు దించేయండి. అంతే వేడి వేడి చేప జన వేపుడు రెడీ.