ప్రస్తుతం ప్రతి ఒక్కరి శరీరంలో రకరకాల ఆరోగ్య సమస్యలు ఉంటాయి. వీటిల్లో ఒకటి బరువు పెరగడం. నేటి జీవన శైలి కారణంగా ఎవరికీ తినడానికి, పడుకోవడానికి సరైన సమయం దొరకడం లేదు. దీంతో బాడీ క్లాక్ సక్రమంగా నడవక రకరకాల రోగాలు పుట్టుకొస్తున్నాయి.
ముఖ్యంగా ప్రతిఒక్కరూ బరువు వేగంగా పెరుగుతున్నారు. శరీరంలో ఎక్కువ కొవ్వు పేరుకుపోతుంది. పని చేసే సామర్థ్యం కూడా తగ్గుతుంది. అందరూ ప్యాకెట్ ఫుడ్, జంక్ ఫుడ్ ఎక్కువగా తింటున్నారు. ఈ ఆహారాలన్నీ తినడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. కాబట్టి మీరు ఏం తింటున్నారు, ఎంత తింటున్నారు అనే దానిపై శ్రద్ధ పెట్టాలి.
ప్రతిరోజూ ఉదయం సబ్జా గింజలతో మీ రోజును ప్రారంభిస్తే ఆరోగ్యంతోపాటు పోషకాలు పుష్కలంగా అందుతాయి. షుగర్ అదుపులో ఉంటుంది. బరువు కూడా సులువుగా తగ్గుతారు. సబ్జా గింజలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.
ఒక కప్పు బాదం పాలు లేదా ఓట్ మిల్క్ తీసుకుని, అందులో 3 చెంచాల తాజా పండ్లు ముక్కలు, 2 చెంచాల చియా విత్తనాలు వేసుకోవాలి. తర్వాత అందులో తరిగిన బాదం, కుంకుమపువ్వు వేసి బాగా కలిపి 6 గంటలపాటు ఫ్రిజ్లో ఉంచాలి. సబ్జా గింజలు ఉబ్బిన తర్వాత దాల్చిన చెక్క పొడి, ఒక చెంచా తేనె కలపాలి.
తరిగిన ఖర్జూరాలు, కొన్ని ఎండుద్రాక్ష, జీడిపప్పు, పిస్తా, బాదం పప్పులను జోడించి తింటే రుచితోపాటు ఆరోగ్యానికి కూడా మేలు జరుగుతుంది. అలాగే వెజిటబుల్ పుడ్డింగ్ తినడం వల్ల కూడా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. రోజూ ఇలా చేసి ఉదయం బ్రేక్ ఫాస్ట్లా తింటే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది.