
జామ పండ్లే కాదు.. జామ ఆకులు కూడా పోషకాలు అందిగా కలిగి ఉంటాయి. జామ ఆకు సారం ప్రేగులలోని చెడు బ్యాక్టీరియాను నాశనం చేసే, విరేచనాలను నిరోధించే యాంటీమైక్రోబయాల్స్ను కలిగి ఉంటుంది. ఇందులో ఫైబర్ అధికంగా ఉన్నప్పటికీ జామలో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. జామ రోజూ తీసుకోవడం వల్ల బరువు కూడా తగ్గిస్తుంది.

స్త్రీలకు ఒక వరం: చాలామంది మహిళలు ఎదుర్కొనే ఋతుక్రమ సమస్యలకు జామ ఒక సహజ పరిష్కారం. జామ ఆకుల సారం లేదా పండులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు నెలసరి సమయంలో వచ్చే తీవ్రమైన కడుపు నొప్పిని తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేస్తాయి.

జీర్ణక్రియ మెరుగు: నేటి కాలంలో ఆహారపు అలవాట్ల వల్ల మలబద్ధకం సర్వసాధారణమైంది. జామపండులో పీచు పదార్థం పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను వేగవంతం చేసి, పేగు కదలికలను మెరుగుపరుస్తుంది. ప్రతిరోజూ జామను తీసుకుంటే మలబద్ధకం సమస్య శాశ్వతంగా దూరమవుతుంది.

రోగనిరోధక శక్తి: నారింజ పండు కంటే జామలో విటమిన్ సి రెట్టింపు ఉంటుంది. ఇది మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి వైరస్, బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ల నుండి రక్షిస్తుంది. ముఖ్యంగా సీజనల్ వ్యాధులైన జలుబు, దగ్గు దరిచేరకుండా చూస్తుంది.

జామ ఆకులను ఎలా తినాలో ఇక్కడ తెలుసుకుందాం.. ముందుగా జామ ఆకులను వేడినీటిలో వేయాలి. వాటిని సుమారు 20 నిమిషాలు ఉడకబెట్టాలి. టీ స్ట్రైనర్ ద్వారా వడకట్టి, సుమారు 5 నిమిషాలు చల్లబరచండి. ఈ గోరువెచ్చని పానీయాన్ని ఖాళీ కడుపుతో తాగాలి. ఇది కడుపు నొప్పి నుంచి మీకు ఉపశమనం అందిస్తుంది.

జామపండులో క్యాలరీలు తక్కువ, ఫైబర్ ఎక్కువ. ఇది తిన్న తర్వాత కడుపు నిండుగా అనిపించి, అనవసరమైన ఆకలిని తగ్గిస్తుంది. అంతేకాకుండా జామలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండటం వల్ల ఇది రక్తంలోని చక్కెర స్థాయిలను అకస్మాత్తుగా పెరగనివ్వదు. ఇందులో ఉండే విటమిన్ ఏ కంటి చూపును మెరుగుపరచడంలో తోడ్పడుతుంది.