
రోజ్ వాటర్లో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ డి, విటమిన్ ఇ, విటమిన్ బి3, యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ బాక్టీరియల్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కలిగి ఉన్నాయి. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం,రోజూ తగిన మోతాదులో రోజ్ వాటర్ తాగితే, అది మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

ప్రతిరోజూ రోజ్ వాటర్ తాగడం వల్ల కడుపు జీర్ణక్రియ పరిపూర్ణ స్థితిలో ఉంటుందని అనేక పరిశోధనల్లో తేలింది. గొంతు నొప్పి ఉన్నవారు రోజ్ వాటర్ను తమ ఆహారంలో చేర్చుకోవటం వల్ల సమస్య త్వరగా నయమవుతుంది. ఎందుకంటే ఇందులో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి.

రక్తపోటును నియంత్రణలో ఉంచడానికి రోజ్ వాటర్ ఉత్తమ ఎంపిక. శీతాకాలంలో మన రోగనిరోధక శక్తి తరచుగా బలహీనపడుతుంది. మీరు కూడా మీ రోగనిరోధక శక్తిని బలోపేతం చేసుకోవాలనుకుంటే, ఖచ్చితంగా రోజ్ వాటర్ తాగాలని చెబుతున్నారు.

రోజ్ వాటర్ లో శక్తివంతమైన క్రిమినాశక లక్షణాలు ఉంటాయి. ఇవి ఇన్ఫెక్షన్ల నుంచి మనల్ని రక్షిస్తాయి. అలాగే ఇన్ఫెక్షన్లను తొందరగా తగ్గిస్తాయి. అందుకే రోజ్ వాటర్ ను తరచుగా వివిధ సహజ, ఔషధ చికిత్సలలో ఉపయోగిస్తారు. కండ్లకలకు తగ్గించడానికి వాడే కంటి చుక్కలలో రోజ్ వాటర్ ను ఉపయోగిస్తారని ఆయుర్వేద ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. రోజ్ వాటర్ లో ఉండే క్రిమినాశక, అనాల్జేసిక్ లక్షణాలు కంటి వ్యాధులను నయం చేస్తుంది.

గులాబీ రేకులు, గులాబీ నూనెలో శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కణాలు దెబ్బతినకుండా కాపాడతాయి. ఈ యాంటీఆక్సిడెంట్లు సంభావ్య లిపిడ్ పెరాక్సిడేషన్ నిరోధక ప్రభావాలను కలిగి ఉంటాయని పరిశోధకులు చెబుతున్నారు. ఇవి మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.