
ఖర్జూరం గింజలతో కాఫీని తయారుచేయడానికి ఖర్జూరాలను ఎండబెట్టి మెత్తగా పౌడర్ చేసుకోవాలి. దీన్ని నీళ్లలో నానబెట్టి మళ్లీ ఎండబెట్టుకోవాలి. ఇప్పుడు ఖర్జూరం సిరప్ దాల్చిన చెక్క, యాలకుల పొడి, వేడి పాలతో కాఫీని తయారుచేసుకోవాలి. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.

ఖర్జూర గింజలను బాడీ బాడీ స్క్రబ్ గా ఉపగించవచ్చు. ఈ బాడీ స్క్రబ్ వల్ల మీ శరీరంలోని మృతకణాలు చాలా వరకు తొలగిపోతాయి. ఇందుకోసం ఖర్జూరం గింజలను పొడిగా చేసుకోవాలి. అందులో కావాల్సినంత మేర పెరుగును వేసి చిక్కటి పేస్ట్ లా చేసుకోవాలి.. దీన్ని శరీరానికి అప్లై చేసి స్క్రబ్ చేయండి.

కోకో పౌడర్ ను ఉపయోగించే వారు దాని ప్లేస్ లో బేకింగ్ ఖర్జూర గింజలను ఉపయోగించవచ్చు. అయితే వీటిని ఎక్కువగా మాత్రం ఉపయోగించకూడదు. లిమిట్ లో ఉపయోగించడం వల్ల ఎలాంటి హాని జరగదు.

ఖర్జూరంలో కాల్షియం, మాంగనీస్, ఫాస్పరస్ వంటి ఖనిజాలు ఉంటాయి. ఇవి ఎముకల దృఢత్వానికి తోడ్పడతాయి. కీళ్ల నొప్పులను నివారించడానికి ప్రతిరోజూ ఉదయం నానబెట్టిన ఖర్జూరం తినడం అలవాటు చేసుకోవాలి. అంతేకాకుండా నానబెట్టిన ఖర్జూరాలు మెదడు పనితీరును మెరుగుపరచడానికి ఉపయోగపడతాయి. ఈ డ్రై ఫ్రూట్స్లో విటమిన్ బి6, మాంగనీస్ ఉంటాయి. ఇవి మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.

ఖర్జూరం గింజలను వేయించి జంతువులకు ఆహారంగా కూడా ఇవ్వొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ గింజలు గేదెలు, ఆవులు, గుర్రాలకు మేతగా ఉపయోగపడుతుంది. వీటిని తింటే ఈ జంతువుల ఎదుగుదల బాగుంటుందని చెబుతున్నారు.