
పసుపు-వేడినీరు: ఉదయం ఖాళీ కడుపుతో అర టీస్పూన్ పసుపును ఒక గ్లాసు వేడి నీటిలో కలిపి తాగడం వల్ల శరీరం డిటాక్సిఫై అవుతుంది. అంతేకాదు దీనివల్ల జీవక్రియ మెరుగుపడుతుంది. ఇది ఆహారాన్ని జీర్ణం చేయడంలో ఉపయోగపడుతుంది. తద్వారా బరువును తగ్గించడంలో సహాయపడుతుంది. దీర్ఘకాలిక మంట గుండె జబ్బులు, క్యాన్సర్, అల్జీమర్స్ వ్యాధితో సహా అనేక రకాల ఆరోగ్య సమస్యలను దూరం చేస్తుంది. పసుపు నీటిని క్రమం తప్పకుండా తాగడం వల్ల శరీరంలో మంట తగ్గుతుంది, ఇది దీర్ఘకాలిక వ్యాధులను నివారించడంలో సహాయపడుతుంది .

మీరు జీర్ణకోశ సమస్యలతో బాధపడుతుంటే పసుపు కలిపిన పాలు తాగకూడదు. ఇది గ్యాస్, ఉబ్బరం, అతిసారం, కడుపు నొప్పి, వికారం, తిమ్మిరిని కలిగిస్తుంది.

పసుపు, నిమ్మరసం తాగితే శరీరంలో కొవ్వు కరుగుతుంది. అధిక బరువు తగ్గుతారు. జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపస్తాయి. కాలేయం ఆరోగ్యంగా ఉంటుంది. శ్వాసకోశ సమస్యల నుంచి రక్షణ కలిగిస్తాయి. పసుపు, నిమ్మరసం కలిపి సేవిస్తే కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం పొందవచ్చు. పసుపు, నిమ్మ రసం వల్ల గుండె జబ్బులను దూరం పెట్టొచ్చు. వీటిలో ఉండే యాంటీయాక్సిడెంట్లు, యాంటీ డిప్రెసెంట్ గుణాలు ఒత్తిడిని తగ్గిస్తాయి. నిమ్మరసం, పసుపు మిశ్రమాన్ని ముఖానికి ఫేస్ ప్యాక్లా ఉపయోగించవచ్చు. చర్మ సమస్యలు తగ్గుతాయి. ముఖంను అందంగా మార్చుతుంది.

డయాబెటిక్, కీమోథెరపీ మందులు తీసుకునేవారు పసుపు కలిపిన పాలు తాగకూడదు. ఇవే కాకుండా ఏదైనా మందులు తీసుకుంటే మాత్రం పసుపు కలిపిన పాలు తాగే ముందు వైద్యుడిని తప్పనిసరిగా సంప్రదించాలి.

పసుపు- అల్లం టీ: తేనె, నిమ్మకాయలతో కలిపి అల్లం, పసుపు టీ తీసుకోవడం వల్ల వాపు తగ్గుతుంది. జీవక్రియ కూడా మెరుగుపడుతుంది. అల్లంలో జీర్ణం ఎంజైములు ఉత్పత్తి చేసే శక్తి ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థకు సహాయపడుతుంది. కాబట్టి ఈ రెండు కలిపి తీసుకోవడం వల్ల అజీర్ణం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు రావు. పొట్ట ఆరోగ్యం చక్కగా ఉంటుంది. పసుపు, అల్లం ఈ రెండిట్లో కూడా యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. కాబట్టి రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అంటు వ్యాధుల ప్రమాదం తగ్గుతుంది.