
సాధారణంగా యుద్ధం వస్తే బంగారం ధరలు పెరుగుతాయి. కానీ ఈసారి మాత్రం సీన్ రివర్స్ అయింది. గత రెండ్రోజులు బంగారం, వెండి ధరలు పడిపోయాయి. కారణాలు ఏంటనేది పక్కనబెడితే, ఇది సామాన్యుడికి బిగ్ రిలీఫ్ అనుకున్నారు అందరూ. కానీ అంతలోనే ఎవరూ ఊహించని విధంగా మళ్లీ బంగారం ధరలు పుంజుకన్నాయి. శుక్రవారం కేవలం 4 గంటల్లోనే తులం బంగారంపై రూ. 650 పెరిగింది. ఇక సిల్వర్ మాత్రం కేజీ రూ.100 తగ్గి స్వల్ప ఊరటనిచ్చింది.

ఈ భారీ హెచ్చుతగ్గుల తర్వాత హైరదాబాద్లో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర ప్రస్తుతం రూ.1,50,930గా ఉండగా ఉదయం 6 గంటలకు ఈ ధర రూ.1,50,270, వద్ద స్థిరపడింది. అంటే జస్ట్ 4 గంటల్లోనే తులం బంగారంపై రూ.600లకు పైగా పెరిగింది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర ప్రస్తుతం రూ.1,38,350గా ఉండగా ఉదయం 6 గంటలకు ఈ ధర రూ.1,37,740 వద్ద స్థరపడింది.

ఇక ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ, విశాఖపట్నం, ఆర్థిక రాజధాని ముంబై, బెంగళూరు, కేరళ, పూణెలోనూ 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,50,930గా ఉండగా 22 క్యారెట్ల ధర రూ.1,38,350వద్ద కొనసాగుతుంది.

ఇక దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర ప్రస్తుతం రూ.1,51,080గా ఉండగా ఉదయం 6గంటలకు ఈ ధర రూ.1,50,420 వద్ద స్థరపడింది. ఇక 22 క్యారెట్ల ధర రూ.1,35,500లు గా ఉంది. ఇక చెన్నైలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,51,630గా ఉండగా 22 క్యారెట్ల ధర రూ.1,38,999 గా ఉంది.

ఇక వెండి విషయానికి వస్తే, హైదరాబాద్లో ఇవాళ ఉదయం 6గంటలకు కేజీ వెండి ధర రూ. రూ.2,64,900 లు ఉండగా దీనిపై 100 రూపాయలు తగ్గి ఉదయం 10 గంటలకు కేజీ బంగారం ధర రూ. రూ.2,64,900 వద్ద స్థిరపడింది. కానీ దేశీయ మార్కెట్లో మాత్రం వెండి ధర భారీగా తగ్గింది. దేశీయ మార్కెట్లో ఉదయం రూ.2,60,000 ఉన్న కేజీ వెండి ధర 4 గంటల్లోనే రూ.5వేలు తగ్గి ప్రస్తుతం రూ.2,55,000 వద్ద ట్రేడవుతుంది.