
అసలు కొంచం పంచదార కూడా వాడకుండా.. నేచురల్ తీపితో తయారు చేసే పచ్చికొబ్బరి-ఖర్జూరం లడ్డూలు ఇలా చేస్తే పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. అంతేకాదు, ఇవి శరీరానికి కూడా ఎంతో బలం. ఇంకా ఇవి శక్తిని కూడా అందిస్తాయి. అలాగే, సహజ రుచి ఉంటుంది. దీనిని ఎలా తయారు చేయాలో ఇక్కడ చూద్దాం..

పచ్చికొబ్బరి-ఖర్జూరం లడ్డూలకు కావలసిన పదార్థాలు: రెండు కప్పుల పచ్చికొబ్బరి తురుము, ఒక కప్పు ఖర్జూరాలు అది కూడా గింజలు తీసినవి తీసుకోవాలి. ఇంకా వీటి కోసం నాలుగు బాదంపప్పులు, అలాగే 10 జీడిపప్పు, అర టేబుల్ స్పూన్ యాలకుల పొడి, ఇంకా ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా తీసుకోవాలి. అలాగే గస గసాలు, ఇంకా నువ్వులు కూడా రెండు టేబుల్ స్పూన్లు తీసుకోవాలి.

పచ్చికొబ్బరి-ఖర్జూరం తయారీ విధానం: ముందుగా ఖర్జూరాలను తీసుకుని 10 నిమిషాలు పాటు వెచ్చని నీటిలో బాగా నానబెట్టి వాటిని మెత్తగా చేసుకోవాలి. ఇంకా బాదం, జీడిపప్పును కూడా తీసుకుని వాటిని ముక్కలుగా చేసుకుని వాటిని బాగా వేయించుకోవాలి. ఇంకా ఈ పాన్లో కొద్దిగా నెయ్యి వేసి అలాగే, పచ్చికొబ్బరిని కూడా 3 నిమిషాల పాటు తక్కువ మంటపై బాగా వేయించాలి.

ఇంకా ఇప్పుడు ఈ ఖర్జూరాలను కూడా దానిలో వేసి బాగా కలుపుతూ మెత్తగా అయ్యే వరకు బాగా కలపాలి. ఇంకా దీనిలో వేయించిన బాదం, నాలుగు జీడిపప్పులు, కొద్దిగా నువ్వులు, ఇంకా ఒక టేబుల్ స్పూన్ యాలకుల పొడిని వేసి మిక్స్ అయ్యేలా కలపాలి. ఇంకా ఇది బాగా చల్లారిన తర్వాత కొద్దిగా నెయ్యి రాసుకుని లడ్డూలుగా చేసుకోవాలి. చేసిన తరవాత గాలి వెళ్ళని డబ్బాలో వీటిలో పెట్టుకోవాలి.

ఇవి చక్కెర లేకుండానే నేచురల్ తీపితో మంచిగా ఉంటుంది. రక్త హీనతతో ఇబ్బంది పడే వాళ్ళకి సూపర్ ఫుడ్ . ఇంకా ఇది పిల్లలకు కూడా అదిరిపోయే హెల్తీ ఫుడ్ అని చెప్పొచ్చు. ప్రయాణాల్లో ఈ లడ్డు ఒకటి తింటే శక్తి కూడా అందుతుంది. అందించే చాలా మంది దీనిని నేచురల్ ఎనర్జీ బూస్టర్గా అని చెబుతుంటారు. పిల్లల నుండి ముసలివాళ్ళ వరకు తినొచ్చు.