వారం మొత్తం పని ఒత్తిడుల కారణంగా చాలా మంది ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టరు. దీంతో త్వరగా మానసిక, శారీరకంగా అలసి పోతుంటారు. తగినంత విశ్రాంతి తీసుకోకపోవడం వల్ల ఆరోగ్యానికి ఈ విధమైన హాని కలుగుతుంది. దీంతో రోజంతా అలసిపోయినట్లు అనిపిస్తుంది.
టీ, కాఫీలు తాగుతూ పనిచేసినా అలసట తగ్గడం జరగదు. శారీరక అలసట నుంచి బయటపడటానికి సరైన ఆహారం తీసుకోవాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. మాంసకృత్తులు, విటమిన్లు, ఖనిజాలతో కూడిన ఆహారాలు మాత్రమే శారీరక అలసట నుంచి ఉపశమనం కలిగిస్తాయి.
ఏ సీజనలోనైనా లభించే అన్ని పండ్లను తినాలి. కాలానుగుణ పండ్లలో వివిధ ఎంజైములు, మెగ్నీషియం, పొటాషియం, ఐరన్ ఉంటాయి. ఇవి శారీరక పనితీరు, అలసటకు సహాయం చేస్తాయి. అలాగే ఆకుకూరల్లో విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.
శారీరక అలసట నుండి ఉపశమనం పొందడానికి చియా విత్తనాలను తీసుకోవచ్చు. చియా గింజలలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి మెదడు, గుండె పనితీరుకు అవసరం. ఇందులో మెగ్నీషియం కూడా ఉంటుంది. ఇది అలసట, ఒత్తిడిని తగ్గిస్తుంది. రోజువారీ ఆహారంలో వాల్నట్లు, బాదం, బ్రెజిల్ నట్స్, జీడిపప్పు, హాజెల్నట్లు, పిస్తాలు మొదలైన వాటిని చేర్చుకోవాలి. ఇవి కడుపు నింపి పని చేసే శక్తిని అందిస్తాయి. ఇవి శరీరంలోని పోషకాహార లోపాన్ని కూడా పూరిస్తాయి.
శారీరక అలసటను తొలగించుకోవాలనుకుంటే బ్రేక్ ఫాస్ట్ మానేయకూడదు. దాటవేయవద్దు. బ్రేక్ ఫాస్ట్లో ఓట్స్ తీసుకోండి. ఓట్స్ తక్కువ కొవ్వు కలిగి ఉంటాయి. వీటిని పాలుతో కలిపి తినవచ్చు. ఇది కడుపు నిండుగా ఉంచడమే కాకుండా, రక్తంలో చక్కెర స్థాయి, కొలెస్ట్రాల్ స్థాయిని అదుపులో ఉంచుతుంది. పని చేయడానికి తగినంత శక్తిని అందిస్తుంది.