
భోజనానికి ముందు నిమ్మరసం తాగడం వల్ల జీర్ణాశయంలో ఉండే ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా పెరుగుతుంది, ఇది ఆహారాన్ని సులభంగా జీర్ణం చేస్తుంది. అలాగే, నిమ్మరసం ఆహారం జీర్ణం కావడానికి సహాయపడే జీర్ణ రసాలను ప్రోత్సహిస్తుంది.

బరువు తగ్గాలనుకునే వారు కూడా భోజనానికి ముందు నిమ్మరసం తాగాలని నిపుణులు చెబుతున్నారు. నిమ్మకాయ నీరు ఆకలిని నియంత్రించడంలో సహాయపడుతుంది. దీంతో సహంజంగానే తక్కువ ఆహారం తీసుకుంటాం. ఇది ఒకరకంగా బరువు తగ్గడానికి దోహదపడుతుంది. అలాగే నిమ్మకాయ నీరు జీవక్రియను పెంచుతుంది, ఇది కేలరీలను వేగంగా బర్న్ చేయడంలో ఉపయోగపడుతుంది దీంతో సులభంగా బరువు తగ్గొచ్చు.

లెమన్ వాటర్ను క్రమంతప్పకుండా తీసుకోవడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఒత్తిడి, ఆందోళనతో బాధపడుతున్న వారికి బాగా ఉపయోగపపడుతుంది. సాధారణంగా ఒత్తిడి కూడా జీర్ణ వ్యవస్థపై ప్రభావం పడుతుందని నిపుణులు అంటున్నారు.

ఎసిడిటీ సమస్యతో బాధపడేవారు భోజనానికి ముందు నిమ్మరసం తాగడం వల్ల కూడా మేలు జరుగుతుంది. శరీరంలోని ఎసిడిటీని బ్యాలెన్స్ చేయడలో లెమన్ వాటర్ కీలక పాత్ర పోషిస్తుందని అంటున్నారు. రోగ నిరోధక శక్తికి బలోపేతం చేయడంలో నిమ్మరసం ఉపయోగపడుతుంది. ఇదులోని విటమిన్ సితో పాటు యాంటీ ఆక్సిడెంట్స్ శరీరంలో రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. దీంతో తరచూ వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్త పడొచ్చు.

నిజానికి, వేడి లేదా గోరువెచ్చని నీటిలో తేనె కలిపి తాగడం ఆరోగ్యానికి హానికరం అని నిపుణులు అంటున్నారు. దీనిపై ఇటీవల ఒక షాకింగ్ నివేదిక వెలువడింది.