
ప్రతి సంవత్సరం డిసెంబర్ 25న క్రీస్తు పుట్టిన రోజు సందర్భంగా ప్రపంచం మొత్తం క్రిస్మస్ వేడుకలను గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ క్రిస్మస్ వేడుకల్లో భాగంగా క్రైస్తవులు తమ ఇంటిలో క్రిస్మస్ ట్రీ లను, క్రిస్మస్ స్టార్ లను ఏర్పాటు చేసుకుని, విద్యుత్ దీపాలతో ఎంతో అందంగా అలంకరిస్తారు. పండుగను పురస్కరించుకుని ప్రతి చర్చ్ లలో క్రిస్మస్ ట్రీ లను ఏర్పాటు చేయడం ఆనవాయితీగా వస్తోంది.

డిసెంబర్ నెల వచ్చిందంటే చాలు క్రిస్మస్ హడావుడి మొదలవుతుంది. క్రిస్మస్ పండుగ రోజు ఫర్ చెట్టు గా పిలవబడే క్రిస్మస్ ట్రీ అలంకరించడం పదవ శతాబ్దం నుంచి ప్రారంభించారు.1832లో ప్రొఫెసర్ చార్లెస్ ఫోలెన్ క్రిస్మస్ ట్రీ ను కొవ్వొత్తులు వెలిగించి అలంకరించారు. రాను రాను ఈ క్రిస్మస్ ట్రీను విద్యుత్ దీపాలతో అలంకరించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రిస్మస్ పండుగ కోసం ప్రతి ఏటా కొన్ని వేల సంఖ్యలో ఈ ఫర్ చెట్లను పెంచుతున్నారు.ఈ విధంగా ప్రతి క్రిస్మస్ పండుగకు క్రిస్మస్ ట్రీ లను పెట్టుకొని ఎంతో ఘనంగా ఈ పండుగను జరుపుకుంటారు. క్రిస్మస్ ట్రీతో పాటు గృహలను విద్యుదీపాలతో అలంకరిస్తారు.

క్రిస్టమస్ రోజున ఈ ట్రీ ను ఎందుకు పెట్టుకుంటారో అనే అనుమానం సాధారణంగా వస్తుంది. పూర్వం క్రైస్తవులందరూ కానుకలను తీసుకొని చర్చి కి వెళ్ళడం ఒక ఆనవాయితీగా ఉండేది. ఒక ఊరిలో నివసిస్తున్న ప్లాబో అనే పేద పిల్లవాడికి కానుకగా తీసుకెళ్లడానికి చేతిలో చిల్లిగవ్వ లేకపోతే తన ఇంటి ముందు ఎంతో అందంగా పెరిగిన మొక్కను కుండీలో పెట్టుకుని చర్చికి తీసుకెళ్లాడు. దీంతో క్రిస్మస్ రోజున ట్రీని పెట్టుకోవడం ఆనవాయితీగా వస్తోంది.

క్రిస్మస్ ముందు రోజు రాత్రి శాంతా క్లాజ్ ఆకాశం నుంచి ధృవపు జింకలు లాగే బండిలో వచ్చి పిల్లలకు బహుమతులు ఇచ్చి వెళ్తాడని నమ్ముతారు. అందుకోసం పిల్లలు తమ మేజోళ్లను వేలాడదీసి ఉంచుతారు. ఇలా ఉంచితే శాంతా క్లాజ్ వాటిలో బహుమతులను వేసి వెళ్తాడని నమ్మకం. క్రిస్మస్ రోజున బంధు మిత్రుల ఇళ్ళకు వెళ్లి శుభాకాంక్షలు తెలుపుతారు. క్రిస్మస్ ఏడాదికి ఒకసారి మాత్రమే వస్తుంది కాబట్టి వచ్చేటప్పుడు ప్రేమాభిమానాలను సుఖసంతోషాలను తెస్తుందని క్రైస్తవుల విశ్వాసం

క్రిస్మస్కు ప్రారంభం ముందు నుంచే క్రైస్తవులు తమ ఇళ్లపై నక్షత్ర ఆకృతులను అలంకరించుకుంటారు. తూర్పు దేశాల వారికి దారి చూపిన దివ్య నక్షత్రాన్ని క్రీస్తు జయంతి సందర్భంగా ప్రత్యేక చిహ్నంగా భావిస్తారు. అందుకు క్రీస్తు రాకను కాంక్షిస్తూ క్రైస్తవ ప్రార్థనా మందిరాలు, ఇళ్లపై అలంకరించడం ఒక సంప్రదాయంగా నేటికీ కొనసాగుతుంది. దీంతో పెద్ద ఎత్తున విద్యుద్దీపాలతో గృహలను అలంకరిస్తారు.