
కిడ్నీని ఆరోగ్యం కోసం ఎల్లప్పుడూ రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాన్ని తీసుకోవడం ఎంతో ముఖ్యం. భారతీయ వంటల్లో ఉపయోగించే కొన్ని ఆయుర్వేద మూలికలను ఉపయోగిస్తే కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి. వర్షాకాలంలో వీటిని క్రమం తప్పకుండా ఉపయోగిస్తే మంచి ఫలితాలు లభిస్తాయి.

మూత్రపిండాల కోసం పసుపు: మీ రోజువారీ ఆహారంలో పసుపు పొడితో చేసిన చట్నీని తీసుకోండి. పసుపులో యాంటీ ఇన్ఫ్లమేటరీ ఎంజైమ్లు, కర్కుమిన్ అనే సమ్మేళనం కారణంగా శరీరంలో వాపు, నొప్పిని కలిగించే బ్యాక్టీరియా, వైరస్లను నశింపజేస్తుంది.

అయితే, ఎవరికైనా కామెర్లు వస్తే చికిత్స సమయంలో పసుపును తీసుకోవలసిన అవసరం లేదు. దీనికి వైద్యపరమైన కారణాలు కూడా ఉన్నాయి. కానీ ఆరోగ్యంగా ఉండాలంటే మాత్రం ప్రతిరోజూ ఆహారంలో పసుపును తీసుకోవాలి. ఇది కామెర్లు వచ్చే ప్రమాదం నుంచి కాపాడుతుంది. వర్షకాలంలో భోజనం తర్వాత, మంచినీటిలో పసుపు కలిపి తీసుకోండి. ఇలా రోజుకు ఒకసారి మాత్రమే చేయండి.

అల్లం తీసుకోవడం వల్ల కిడ్నీ ఆరోగ్యంగా ఉంటుంది: కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచాలంటే అల్లం కచ్చితం తీసుకోవాల్సిన ఆహారం. బ్లాక్ టీలో కొద్దిగా అల్లం కలిపి రోజూ తాగవచ్చు. చట్నీ, పప్పు, కూరగాయలు మీరు చేసుకొనే ప్రతి ఆహారంలో అల్లం ఉపయోగించండి. దీనిలో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఫంగల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి.

కిడ్నీ ఆరోగ్యంగా ఉండాలంటే వెల్లుల్లిని తినండి: వెల్లుల్లిలో అల్లిసిన్ అనే సమ్మేళనం శరీరంలో మంట, నొప్పి, ఇన్ఫెక్షన్కు కారణమయ్యే సూక్ష్మ జీవులను నిరోధిస్తుంది. అందువల్ల పప్పు, కూరగాయలు, చట్నీలో వెల్లుల్లిని కచ్చితంగా ఉపయోగించండి. మీరు తెలియక వ్యాధి సోకిన ఆహారం లేదా నీరు తీసుకుంటే మీ శరీరం నుండి విషాన్ని ఫిల్టర్ చేయడంలో వెల్లుల్లి సహాయపడుతుంది.