
ఒత్తిడి అనేది ప్రతీ ఒక్కరికీ ఉంటుంది. స్కూల్కి వెళ్లే పిల్లల నుంచి మొదలు వృద్ధులకు కూడా ఒత్తిడి అనేది ఉంటుంది. అయితే దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తున్నారన్నది ముఖ్యం. అందులోనూ ఆఫీసులకు వెళ్లేవారు మరింత ట్రెస్కి గురవుతున్నారు. ప్రతీ ఐదుగురు వ్యక్తుల్లో ఒకరు ఒత్తిడికి గురవుతున్నారని పలు అధ్యయనాలు చెబుతున్నాయి.

ఒత్తిడి అనేది ప్రతీ ఒక్కరిలో ఉండే ప్రాబ్లమే. చిన్న విషయాలకు కూడా ఎక్కువగా ఆలోచించడం మానేస్తే.. ఒత్తిడికి లోనవ్వకుండా ఉండొచ్చు. శరీరంలో అడ్రినాలిన్, కార్టిసోల్ అనే హార్మోన్లు విడుదల కావడం వల్ల ఒత్తిడి అనేది వస్తుంది.

ఒత్తిడి అనేది కేవలం ఆర్థిక సమస్యలు, ఇంటి సమస్యలు, ఆఫీస్ ప్రాబ్లమ్స్ వల్లనే కాదు.. వాతావరణం, శబ్దాలు, కాలుష్యం వల్ల కూడా ఒత్తిడికి గురవుతూ ఉంటారు. స్ట్రెస్ని జయించాంటే.. ముందు ఒత్తిడి ఎందుకు? ఎలా? కలుగుతుందో తెలుసుకోవాలి. దానికి తగ్గట్లుగానే నివారణ చర్యలు కూడా చేపట్టాలి.

అలాగే నిద్ర కారణంగా, సరైన ఆహారం తీసుకోక పోవడం వల్ల కూడా ఒత్తిడి అనేది వస్తుంది. మీరు ఒత్తిడిని జయించాలంటే.. మీ లైఫ్ స్టైల్లో మార్పులు చేసుకోవాలి. మీ ఫ్రెండ్స్ అండ్ బంధువులతో కలిసేందుకు ట్రై చేయండి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి.

ముఖ్యంగా యోగా, వ్యాయామం వంటివి మీ మూడ్ని మార్చేస్తాయి. లేదంటే ఓ కొత్త ప్లేస్కు వెళ్లండి. అయినా సరే మీరు ఒత్తిడి నుంచి బయట పడకపోతే.. హాస్పిటల్కు వెళ్లడం చాలా మంచిది. వైద్యులు ఇచ్చే కౌన్సిలింగ్ తీసుకోవాలి.