
తేలు విలక్షణమైన విష జీవి. అది ఒక్కసారి కాటు వేస్తే దాని విషం శరీరం అంతటా వ్యాపించి తీవ్ర సమస్యలకు కలిగిస్తుంది. అందుకే తేలును చూడగానే చాలా మంది భయపడతారు. తేలు కాటు శరీరంలో మంటను కలిగిస్తుంది. అందుకే తేలు కుట్టిన తర్వాత వీలైనంత త్వరగా ఆసుపత్రికి వెళ్లాలని నిపుణులు చెబుతున్నారు. అయితే తేలు గురించి పలు అపోహలు జనాల్లో నిలిచిపోయాయి.

తేళు పిల్లలు పుట్టిన వెంటనే అవి తమ తల్లులను మింగివేస్తాయని, తేళు పిల్లలు వాటి తల్లులను వేటాడతాయనే నానుడి ప్రచారంలో ఉంది. ఒక ఆడ తేలు తన పిల్లలను పోషించడానికి తన జీవితాన్ని త్యాగం చేస్తుందనే

కానీ నిపుణుల అభిప్రాయం ప్రకారం ఇది కేవలం అపోహ మాత్రమే. ఆడ తేలు గుడ్లు పెట్టకుండానే నేరుగా పిల్లలకు జన్మనిస్తుంది. ఈ ప్రక్రియను స్కార్పియోనింగ్ అంటారు. ఒక ఆడ తేలు ఒకేసారి పది నుంచి 100 వరకు పిల్లలకు జన్మనిస్తుంది. తేలు పిల్లలు పుట్టిన తర్వాత చాలా పెళుసుగా ఉంటాయి. వాటి శరీరం బయటి భాగం గట్టిగా ఉండదు.

తేలు పిల్లలు తమను తాము రక్షించుకోవడానికి తల్లి వీపుపై కూర్చుంటాయి. పిల్లలు దాదాపు పది నుంచి 20 రోజుల వరకు తల్లి వీపుపైనే ఉంటాయి. ఈ సమయంలో ఆడ తేలు తన చిన్న పిల్లలను కాపాడుతుంది. అవి ఇతర జీవులు వేటాడకుండా పిల్లలను కాపాడుతాయి. అరిజోనా స్టేట్ యూనివర్శిటీకి చెందిన ఓ జర్నల్ ప్రకారం నవజాత తేలు పిల్లలు తమ సొంత తల్లిని వేటాడటం చాలా అరుదు అని వెల్లడించింది.

ఈ విధమైన ప్రక్రియ సాలెపురుగులు, సూడోస్కార్పియన్లలో కనిపిస్తుంది. కాబట్టి తేలు పిల్లలు పుట్టిన వెంటనే ఆహారం కోసం వాటి తల్లులను వేటాడతాయనేది నిజం కాదు. కానీ ఆడ తేలు పుట్టిన పిల్లల్లో బలహీనమైన పిల్లలను వేటాడుతుంది. బలహీనమైన పిల్లలను ఆడ తేలు తింటుంది. తద్వారా ఇతర బలమైన పిల్లలు బాగా పోషించబడతాయి.