- Telugu News Photo Gallery Diabetes patients should keep distance with these fruits else your blood sugar levels will high
Health Tips: ఈ పండ్లు షుగర్ బాధితులకు ప్రాణాంతకం.. అస్సలు తినకూడదు..!
డయాబెటిస్ అనేది అత్యంత ప్రమాదకరం. సకాలంలో దీనిని నియంత్రించాలి. బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రించేందుకు లైఫ్స్టైల్ మార్చడమే కాకుండా డైట్ సరిగ్గా ఉండేట్టు చూసుకోవాలి. అయితే, పండ్లు ఆరోగ్యానికి మంచివే కానీ డయాబెటిస్ రోగులు మాత్రం కొన్ని రకాల పండ్లకు దూరంగా ఉండాలి. లేదంటే అలాంటి పండ్లు వారికి ప్రాణాంతకంగా మారే అవకాశం ఉంటుంది. అలాంటి పండ్లను తిన్న వెంటనే రక్తంలో చక్కెరను క్షణాల్లో పెంచుతాయి. డయాబెటిస్లో ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించడం అవసరం. ముఖ్యంగా, ఈ వ్యాధిలో చాలా తీపి పదార్థాలు లేదా తీపి పండ్లు తినకూడదు.
Updated on: Mar 25, 2025 | 8:32 PM

బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంచేందుకు సమ్మర్ స్పెషల్ లీచీ ఫ్రూట్కు దూరంగా ఉండాలి. అలాగే, మరో సమ్మర్ స్పెషల్ ఫ్రూట్ మామిడిని డయాబెటిస్ రోగులు తినకూడదు. ఇది ఆరోగ్యానికి చాలా హాని కల్గిస్తుంది. అందుకే డయాబెటిస్ రోగులు వీటిని తినకూడదు

డయాబెటిస్ రోగులు ద్రాక్ష పండ్లు తినకూడదు. బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగిపోతుంటాయి. వేసవి కాలంలో ప్రత్యేకంగా కన్పించే పుచ్చకాయను డయాబెటిస్ రోగులు అధికంగా సేవించకూడదు.

అరటిపండులో కార్బోహైడ్రేట్లు, చక్కెరలు అధికంగా ఉంటాయి. దీని కారణంగా రక్తంలో చక్కెరను వేగంగా పెంచుతుంది. అటువంటి పరిస్థితిలో డయాబెటిక్ రోగులు అరటిపండ్లను తినకూడదు. వేసవి కాలంలో ప్రత్యేకంగా కన్పించే పుచ్చకాయను డయాబెటిస్ రోగులు అధికంగా సేవించకూడదు.

పైనాపిల్లో కూడా షుగర్ కంటెంట్ ఎక్కువ. ఇందులో చక్కెర కూడా అధికంగా ఉంటుంది.ఇది రక్తంలో చక్కెరను పెంచుతుంది. ఇది తక్కువ పరిమాణంలో తినాలి. షుగర్ రోగులు ఈ పండుకు దూరంగా ఉండటం మంచిదంటున్నారు.ఇది శరీరంలోని ఇన్సులిన్ స్థాయిని పాడు చేస్తుంది.

మధుమేహంతో ఇబ్బందిపడుతున్న వారు కొన్ని రకాల డ్రై ఫ్రూట్స్కు కూడా దూరంగా ఉండాలి. ఇందులో ఎండుద్రాక్ష, ఖర్జూరం, అత్తి పండ్ల వంటి డ్రై ఫ్రూట్స్లో చాలా ఎక్కువ మొత్తంలో సహజ చక్కెర ఉంటుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు వీటిని తినకుండా ఉండాలి.





























